దొడ్డ మనసు చాటుకున్న నిఖిల్
- IndiaGlitz, [Wednesday,June 26 2019]
యువ హీరో నిఖిల్ తన పెద్ద మనసుని చాటుకున్నాడు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తన శక్తిమేర సహకారం అందించే హీరో నిఖిల్ . మరోసారి తన దొడ్డ మనసుని చాటుకున్నారు. ఇటీవల ఆయన భీమవరంలోని ఓ పాఠశాలను సందర్శించారు.
అక్కడ పిల్లలతో సరదాగా గడిపిన నిఖిల్ ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ స్కూల్లోని 300 మంది పిల్లలు స్టార్టింగ్ నుండి ముగిసే వరకు చదువు ఖర్చునంతా తానే భరిస్తానంటూ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తాను భవిష్యత్లో మరిన్ని మంచి కార్యక్రమాలను నిర్వహిస్తానని తెలిపారు.
ప్రస్తుతం 'అర్జున్ సురవరం' సినిమా విడుదల కోసం నిఖిల్ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. మంచి విడుదల తేదీ, థియేటర్స్కోసం నిఖిల్ నిరీక్షిస్తున్నాడు. మరి ఈయన నిరీక్షణ ఎప్పుడు ఫలించనుందో త్వరలోనే తెలియనుంది.