close
Choose your channels

'నిశ్శబ్దం' సెన్సార్ పూర్తి

Wednesday, May 27, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నిశ్శబ్దం సెన్సార్ పూర్తి

అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "నిశ్శబ్దం". మాధవన్, సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, మైఖేల్ హడ్సన్ తదితరులు ఇతర అ పాత్రలో నటించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ తో ఆగింది. లాక్ డౌన్ పొడిగింపు కారణంగా నిశ్శబ్దం చిత్రాన్ని డిజిటల్ మాధ్యమంలో విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. దీనిపై నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ స్పందించారు. నిశ్శబ్దం చిత్రాన్ని దాదాపు థియేటర్స్ లోనే విడుదల చేస్తామని, పరిస్థితులు అంతగా కలిసి రాకపోతే అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తామని చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఆగస్టులో థియేటర్స్ ఓపెన్ అవుతాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తారా లేక డిజిటల్ లో విడుదల చేస్తారా అనేదానిపై క్లారిటీ రానుంది. క్రాస్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానుంది. తెలుగు తప్ప మిగిలిన భాషల్లో ఈ చిత్రం సైలెన్స్ అనే పేరుతో విడుదలవుతుంది. అనుష్క ఈ చిత్రంలో మూగ, చెవిటి అమ్మాయిగా కనపడుతుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.