ఆగ‌స్ట్‌లో ‘నిశ్శ‌బ్దం’

  • IndiaGlitz, [Tuesday,July 14 2020]

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు తెలుగు చిత్ర సీమ‌లో అనుష్క ఓ స‌మాధానంగా క‌న‌ప‌డుతుంది. ఇప్ప‌టికే ఈమె న‌టించిన అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, భాగ‌మ‌తి చిత్రాలు మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. అలాగే ఈమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన నిశ్శ‌బ్దం కరోనా ప్రభావం లేకుంటే ఏప్రిల్ 2న విడుద‌ల కావాల్సింది. కానీ క‌రోనా ఎఫెక్ట్ వల్ల థియేటర్స్ ఓపెన్ చేసే విషయంలో క్లారిటీ రాలేదు. దీంతో కొందరు నిర్మాత‌లు ఓ మోస్త‌రు సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేస్తున్నారు. మ‌రికొంద‌రు వారి సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ లిస్టులో నిశ్శ‌బ్దం సినిమా కూడా చేర‌నుంద‌ట‌. అయితే ఈ సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ పూర్తై , ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత ఈ సినిమాను ప్రముఖ డిజిటల్ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేలా అగ్రిమెంట్స్ చేసుకుంటార‌ట‌.

నిజానికి ముందుగా నిశ్శ‌బ్దం నిర్మాత‌లు త‌మ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయ‌కూడ‌ద‌ని అనుకున్నారు. అధికారికంగానూ ప్ర‌క‌టించారు. అయితే ప‌రిస్థితులు మారాయి. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన నిశ్శ‌బ్దం చిత్రాన్ని కోన‌వెంక‌ట్‌, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. అనుష్క‌త పాటు మాధ‌వ‌న్‌, అంజ‌లి, షాలిని పాండే, సుబ్బ‌రాజు త‌దిత‌రులు న‌టించారు.

More News

బన్నీ నెక్ట్స్ సినిమాపై క్లారిటీ!!

ఈ ఏడాది ప్రారంభంలో వ‌చ్చిన సంక్రాంతికి ‘అల వైకుంఠ‌పుర‌ములో’ చిత్రంతో బారీ స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌.

శ‌ర్వానంద్ సినిమా.. ఆ హీరో క‌థ‌తోనేనా?

యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు.ఈ ఏడాది ‘జాను’

బాలీవుడ్ విలన్‌తో విజ‌య్‌దేవ‌ర‌కొండ ఢీ

టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒక‌రైన విజ‌య్ దేవ‌ర‌కొండ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

షూటింగ్ అంటేనే భయపడుతున్న తెలుగు యాంకర్లు!

అంతా బాగుందనుకున్నా ప్రముఖ యాంకర్లతో బుల్లితెరకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. షూటింగ్ అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారట.

అదే జరిగితే.. అనుష్క అభిమానులకిది షాకింగ్ న్యూసే..

పేరుకే అనుష్క అయినా అభిమానులు ఎక్కువగా ఆమె ముద్దుపేరుతోనే ముద్దుగా స్వీటీ అని పిలుచుకుంటారు.