హ్యాపీ బర్త్ డే టూ నితిన్.. ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Wednesday,March 30 2022]

గతేడాది కరోనా ప్రభావంలో కూడా మూడు సినిమాలను తీసుకొచ్చిన హీరో నితిన్ ఒక్కడే. భీష్మ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మాస్ట్రో, చెక్, రంగ్ దే వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈసారి ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్న నితిన్ ఇప్పుడు ఓ పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమానే మాచర్ల నియోజిక వర్గం.

రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నితిన్ జిల్లా కలెక్టర్‌గా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో.. నితిన్ సరసన కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా ఆడిపాడనున్నారు. ఈ పాటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఆదిత్య మూవీస్ & ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి ఇటీవ‌లే ఓ భారీ యాక్ష‌న్ ఎపిసోడ్‌ షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇవాళ నితిన్ పుట్టినరోజు కావడంతో ‘మాచర్ల నియోజకవర్గం’ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాను జూలై 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు వెల్లడించారు. మ‌రి ఈ సినిమాతో నితిన్ అభిమానులను ఎలా ఆక‌ట్టుకుంటారో చూడాలి.

ఇకపోతే.. నితిన్ చిత్రసీమలో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బోయ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. సినిమా సినిమాకు ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు నితిన్. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్‌ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా ప‌ట్టువ‌దల‌ని విక్ర‌మార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు.

More News

ఏపీకి తెలుగు చిత్ర పరిశ్రమ.. తెరపైకి మరో డిమాండ్, కర్నూలుని మూవీ హబ్‌ చేయాలన్న కేఎస్ రామారావు

తెలుగు  నేల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కేంద్రంగా హైదరాబాద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

ఏపీలో భగ్గుమంటున్న సూర్యుడు.. సీమలో 40కిపైనే ఉష్ణోగ్రత, రేపు కూడా వడగాడ్పులు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారేత్తిస్తున్నాయి. ఉదయం పది గంటలకే సూర్యుడు నిప్పులు గక్కుతున్నాడు.

"ముఖచిత్రం" సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్, బర్త్ డే పోస్టర్ రిలీజ్

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం".

RRR రేంజ్ ప్రమోషన్ Pushpa కి చేసి ఉంటె !!

సినిమా తీసాక దానిపై జనానికి ఆసక్తి ఎలా తీసుకురావాలో తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళికి బాగా తెలుసు.

సిబ్బంది నిర్వాకం.. బ్యాంక్‌కు తాళం, 18 గంటల పాటు లాకర్‌ గదిలో వృద్ధుడి నరకయాతన

బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధుడు రాత్రంతా బ్యాంక్ లాకర్‌లో వుండాల్సి వచ్చింది. ఆయనను లోపలే వుంచి బ్యాంక్‌కు తాళం వేసి వెళ్లారు .