పండ‌గ పందెంలో నితిన్‌..?

  • IndiaGlitz, [Monday,July 20 2020]

యువ క‌థానాయ‌కుడు నితిన్, కీర్తి సురేశ్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ఈ ఏడాది భీష్మ‌తో హిట్ కొట్టిన నితిన్ ఈ వేస‌విలో ‘రంగ్ దే’ చిత్రంతో సంద‌డి చేయాల‌నుకున్నారు. కానీ కోవిడ్ 19 ఎఫెక్ట్ కార‌ణంగా ఈ సినిమా తుది ద‌శ షూటింగ్ ఆగింది. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. థియేట‌ర్స్ ఓపెన్ అయ్యే విష‌యంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్‌గా సినీ స‌ర్కిల్స్‌లో షికార్లు కొడుతున్న స‌మాచారం మేర‌కు ఆగ‌స్ట్ త‌ర్వాత థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌డంపై ప్ర‌భుత్వాలు ఓ నిర్ణ‌యం తీసుకోవ‌చ్చున‌ని ఒక‌వేళ థియేట‌ర్స్‌ను ఓపెన్ చేయాల‌ని అనుకుంటే.... ద‌స‌రా సంద‌ర్భంగా ‘రంగ్ దే’ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ట‌. అంతా అనుకున్న‌ట్లు జ‌రిగితే.. ఈ ఏడాది కూడా నితిన్ మ‌రో స‌క్సెస్ కొడ‌తాడేమో చూడాలి.

ఈ సినిమా పూర్తి కాగానే అంధాదున్ రీమేక్‌తో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ థ్రిల్ల‌ర్ మూవీలోనూ నితిన్ న‌టించాల్సి ఉంది. ఇవి కాకుండా కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో ‘ప‌వ‌ర్ పేట‌’ చిత్రంలోనూ నితిన్ హీరోగా న‌టించాల్సి ఉంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలోనూ కీర్తిసురేశ్ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని స‌మాచారం.

More News

ప‌వ‌న్ 27 కోసం మ‌రో టైటిల్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో

ఈటలపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ తెలంగాణ

ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌పై ట్వట్టర్ వేదికగా తెలంగాణకు చెందిన పలు జిల్లాల వాసులు మండిపడ్డారు.

ఏపీ అసెంబ్లీని కుదిపేస్తున్న కరోనా.. నేడు 9 మందికి పాజిటివ్..

ఏపీలో కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఒక్కరోజే 5 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

శింబుతో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమవుతున్న త్రిష!

అటు కోలీవుడ్‌లోనూ.. ఇటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది త్రిష.

వర్మపై రివెంజ్‌కి ప్లాన్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య బయోపిక్‌ల బాట పట్టిన విషయం తెలిసిందే.