ఇది పాట కాదు.. మా ఎమోష‌న్ అంటున్న నితిన్‌

  • IndiaGlitz, [Friday,December 13 2019]

'శ్రీనివాస క‌ల్యాణం' త‌ర్వాత ఏడాది పాటు ఖాళీగా ఉన్న నితిన్ ఇప్పుడు మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో భాగంగా ముందు వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో 'భీష్మ‌' అనే సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈసినిమాలో తొలి పాట‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ హీరో నితిన్ ట్వీట్ చేశాడు. 'భీష్మ నుండి తొలి సాంగ్ డిసెంబ‌ర్ 27న విడుద‌ల కానుంది. ఇది మా ఫ‌స్ట్ సింగిల్ సాంగ్ కాదు.. మా గీతం.. నా ఎమోష‌న్'' అని తెలిపారు నితిన్‌.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. ఇప్పుడు పాట‌ల సంద‌డిని చిత్ర యూనిట్ మొద‌లెట్టేసింది. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు సినిమాను ఫిబ్ర‌వ‌రి 21న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను, కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలో న‌టించ‌డానికి నితిన్ స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు.

More News

సిక్స్ ప్యాక్ లుక్ లో సాయితేజ్

తెలుగునాట సిక్స్ ప్యాక్ ఓ ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ఈ జాబితాలో మెగాహీరో సాయితేజ్ కూడా చేరాడు.

5 జీవితాల కథనమే 'జోహార్'

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా ‘జోహార్’.

'రాం రాం' పాట 'ఊల్లాల ఊల్లాల' చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది - నిర్మాత ఏ . గురురాజ్

సీనియర్ నటుడు సత్యప్రకాష్  దర్శకత్వంలో సుఖీభవ మూవీస్ పతాకంపై 'లవర్స్ డే'  ఫేమ్ ఎ.గురురాజ్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం "ఊల్లాల ఊల్లాల".

జగన్‌ సర్కార్‌ కూలిపోతుంది..: పవన్ జోస్యం

‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది.

రైతుకి పట్టం కట్టేందుకే జనసేన.. ఇబ్బంది పెడితే నేనొస్తా!

‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది.