సమంత స్థానంలో నిత్యా...

  • IndiaGlitz, [Saturday,May 13 2017]

విల‌క్ష‌ణ పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న మ‌ల‌యాళ ముద్దుగుమ్మ నిత్యామీన‌న్‌. ఎన్టీఆర్ జ‌న‌తాగ్యారేజ్ త‌ర్వాత మ‌రే తెలుగు సినిమాలో నిత్యా నటించ‌లేదు. ఇప్పుడు తెలుగులో ఓ రీమేక్ సినిమాలో నిత్యా న‌టించ‌నుంద‌ట‌. వివ‌రాల్లోకెళ్తే..క‌న్న‌డంలో సూప‌ర్‌హిట్ అయిన చిత్రం 'యు ట‌ర్న్‌' సినిమాను తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్నారు.

ముందు ఆ సినిమాలో హీరోయిన్‌గా స‌మంత‌నే అనుకున్నారు. అయితే ఇప్పుడు స‌మంత త‌న చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. త‌ర్వాత చైత‌న్య‌తో పెళ్ళికి రెడీ అయిపోతుంది. మ‌రి చైతుతో పెళ్ళి త‌ర్వాత స‌మంత సినిమాల్లో న‌టిస్తుందో లేదో తెలియదు. యు ట‌ర్న్ రీమేక్ ఆల‌స్యం అవుతుండ‌టంతో నిర్మాత‌లు నిత్యామీన‌న్‌ను సంప్ర‌దించార‌ట‌. నిత్యామీన‌న్ ఈ రీమేక్‌లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఇది కాకుండా ఓ డెబ్యూ డైరెక్ట‌ర్‌తో కె.ఎస్‌.రామారావు నిర్మాణంలో మ‌రో సినిమా చేయనుంద‌ట‌.

More News

ఈనెల 20న సంపూర్ణేష్ బాబు 'వైరస్' ఆడియో విడుదల!

సంపూర్ణేష్ బాబు టైటిల్ పాత్రలో ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ పతాకంపై ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "వైరస్". "నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్" అనేది ట్యాగ్ లైన్.

ప్రతి పోలీసు కుటంబం చూడాల్సిన చిత్రం 'రాధ' - బివిఎస్ఎన్ ప్రసాద్

యువ హీరో శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ చంద్రమోహన్ దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు నిర్మాతగా రూపొందిన చిత్రం `రాధ`.

సక్సెస్ టూర్ ప్లాన్ లో 'వెంకటాపురం'

రాహుల్, మహిమా మక్వానా హీరో హీరోయిన్స్గా గుడ్ సినిమా గ్రూప్, బాహుమన్య ఆర్ట్స్ బ్యానర్స్పై వేణు మడికంటి దర్శకత్వంలో శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ నిర్మాతలుగా రూపొందిన చిత్రం 'వెంకటాపురం`.

ఈ ఏడాది విడుదలయ్యే చిత్రాల్లో 'వైశాఖం' హిట్ అవుతుంది - సినిమాటోగ్రాఫర్ వాలిశెట్టి వెంకట సుబ్బారావు

ఆర్.జె. సినిమాస్ బేనర్పై డైనమిక్ లేడీ డైరెక్టర్ జయ బి. దర్శకత్వంలో బి.ఎ.రాజు నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'వైశాఖం'. సూపర్స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈనెల 16న రిలీజ్ చేసిన ఈ చిత్రం ఆడియో సూపర్హిట్ అయింది.

'మాతంగి' గా శివగామి రమ్యకృష్ణ

మాగ్నమ్ ఓపస్ మూవీ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా అత్యద్భుత నటన కనబరిచిన రమ్యకృష్ణ ఇప్పుడు ‘మాతంగి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.