నిత్యా..తెలుగువారికి మాత్రమే

  • IndiaGlitz, [Saturday,April 09 2016]
కేర‌ళ కుట్టి నిత్యా మీన‌న్ మంచి న‌టి మాత్ర‌మే కాదు.. మంచి గాయ‌ని కూడా. న‌టిగా కంటే గాయ‌నిగా రాణించాల‌న్న‌దే ఆమె కోరిక‌. అయితే హీరోయిన్ గానే ఎక్కువ అవ‌కాశాలు వ‌స్తుండ‌డంతో అటు వైపే దృష్టి పెడుతున్నాన‌ని ఓ సంద‌ర్భంలో చెప్పుకొచ్చింది నిత్యా. అలాంటి నిత్యాకి గాయ‌నిగా ఓ మంచి అవ‌కాశం దొరికింది. అదేమిటంటే.. ఏకంగా ఆస్కార్ విజేత ఎ.ఆర్‌.రెహ‌మ‌న్ సంగీతంలో పాట పాడే అవ‌కాశం.
త‌మిళ‌, తెలుగు భాష‌ల్లో వేస‌వి కానుక‌గా విడుద‌ల కానున్న '24' చిత్రం కోసం నిత్యా మీన‌న్ ఓ పాట పాడింది. అయితే ఆ పాట అచ్చంగా తెలుగు శ్రోత‌ల‌కే ద‌క్క‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బోస్ సాహిత్యంలో 'లాలీజో' అంటూ సాగే పాట‌ని తెలుగులో నిత్యా పాడింది. ఇదే పాట‌ని త‌మిళ వెర్ష‌న్‌లో శ‌క్తిశ్రీ గోపాల‌న్ పాడింది. ఏదేమైనా న‌టిగానే కాకుండా గాయ‌నిగానూ నిత్యాని ఇష్ట‌ప‌డే వారికి ఇది శుభ‌వార్తే. ఇదివ‌ర‌కు రెహ‌మ‌న్ సంగీత‌మందించిన 'ఓకే బంగారం'లో న‌టించినా తెలుగు, త‌మిళ వెర్ష‌న్‌ల కోసం నిత్యా ఒక్క పాట కూడా పాడ‌క‌పోవ‌డం ఇక్క‌డి కొస‌మెరుపు.

More News

సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్డ్ డే కలెక్షన్స్..

పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ డే రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేసింది.

అక్షయ్ కోసం శంకర్ కేర్...

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 2.0

దటీజ్ పవన్ స్టామినా అంటున్న బాబీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న రష్మీ గౌతమ్ అంతం...ఫస్ట్ లుక్ విడుదల

రష్మీ గౌతమ్,చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం అంతం.రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని కావడంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన అంతం

శ్రీకాంత్ కు లీగల్ నోటీసులు...

శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.