అలాంటి పాత్ర‌లు చేయ‌నంటున్న నిత్యా

  • IndiaGlitz, [Wednesday,March 07 2018]

పాత్ర ఎటువంటిదైనా అందులో పరకాయ ప్రవేశం చేసి.. ఆ పాత్రకే వన్నె తెచ్చే నటి నిత్య మీనన్. ఇటీవల నాని నిర్మాణంలో ఆమె నటించిన 'అ!' సినిమాలో.. లెస్బియన్ పాత్రకి ఎవరిని ఎంపిక చేయాలా అని దర్శకుడు తర్జనభర్జన పడుతూ ఉంటే.. నాని వెంటనే ఈ పాత్ర గురించి నిత్యకి చెప్పు, ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది అని చెప్పారంటే.. ఒక నిర్మాతగా నానికి ఆమె పై ఉన్న నమ్మకం ఏమిటో అర్ధమవుతుంది.

ఇలాగే ఎవరూ చేయలేని పాత్రల్ని నిత్యకి చెప్పి చేయించుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే.. 2016లో విడుదలైన మొదటి ఆఖరి చిత్రాలు '24', 'ఇరుమురుగన్' (తెలుగులో 'ఇంకొక‌డు'), 2017లో విడుదలైన 'మెర్సల్' (తెలుగులో 'అదిరింది'), ఇక ఇటీవల రిలీజ్ అయిన 'అ!' చిత్రాల్లో ఈమెవి చనిపోయే పాత్రలు కావడం గ‌మ‌నార్హం.

ప్రేక్షకుల్లో సానుభూతి అయితే ఈ పాత్రల‌కి వచ్చింది గానీ.. ఇక ఇటువంటి పాత్రలు చేయనని తేల్చి చెప్పేసింది ఈ మలబార్ భామ. "ఒకసారి ఇటువంటి పాత్రతో విజయం సాధిస్తే.. అటువంటి కథలే వస్తాయి.. ప్రేక్షకులు కూడా దానికే అలవాటు పడిపోతారు.. కొద్ది రోజులు ఇటువంటి పాత్రలకు గ్యాప్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అంటూ ఇటీవల ఇచ్చిన‌ ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పేసింది నిత్య.