సంక్రాంతి రేసులో అక్కినేని హీరోలు  లేరా..?

  • IndiaGlitz, [Friday,December 04 2020]

కోవిడ్ సినీ రంగంపై చాలా పెద్ద ప్ర‌భావాన్ని చూపిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి భ‌యం లేకుండా షూటింగ్స్ స్టార్ట్ కావ‌డం లేదు. తగు జాగ్ర‌త్త‌ల‌తోనే అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇక రిలీజ్‌ల విష‌యంలోనూ థియేట‌ర్స్‌కు 50 శాతం ఆక్యుపెన్సీతో ఓకే చెప్పారు. ఇప్పుడిప్పుడే నిర్మాత‌లు సినిమాల‌ను విడుద‌ల చేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈ ఏడాదిలో సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌, క‌ప‌ట‌ధారి సినిమాలు విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే సంక్రాంతి బ‌రిలోకి ఎవ‌రు దిగుతార‌నే దానిపై ప‌లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’‌, ర‌వితేజ ‘క్రాక్‌’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ చిత్రాలు రేసులో ఉన్నాయన్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు అక్కినేని బ్ర‌ద‌ర్స్ (చైత‌న్య‌, అఖిల్‌) సంక్రాంతి రేసు నుండి త‌ప్పుకున్నార‌ట‌. అందుకు కారణం యాబై శాతం ఆక్యుపెన్సీతో సినిమాను విడుద‌ల చేయ‌డం వ‌ల్ల ఉప‌యోగం ఉండ‌బోద‌ని నిర్మాత‌లు భావించే సంక్రాంతికి కాకుండా స‌మ్మ‌ర్‌లో వ‌స్తే ఎలా ఉంటుందా? అని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ట‌. మ‌రి ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ ఏదేని అదికారిక ప్ర‌క‌ట‌న చేస్తారేమో చూడాలి.

More News

ప్ర‌భాస్ ‘స‌లార్‌’కు అర్థం చెప్పిన డైరెక్ట‌ర్‌

బాహుబ‌లితో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ ఏక‌ధాటిగా ప్యాన్ ఇండియా  సినిమాల‌ను అనౌన్స్ చేస్తున్నాడు.

గ్రేటర్ ఫలితం: తొలిరౌండ్‌లో ‘కారు’దే జోరు...

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి తొలి రౌండ్ పూర్తైంది.

‘ఆచార్య’ కోసం రూ.20 కోట్లతో భారీ సెట్...

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'ఆచార్య'.

తెలంగాణ ఎన్నికల సంఘానికి హైకోర్టు షాక్..

జీహెచ్ఎంసీ కౌంటింగ్‌లో స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలంటూ నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది.

నేడు గ్రేటర్ పరిధిలో బొమ్మ పడనుంది...

కొవిడ్‌ మహమ్మారి కారణంగా మూతపడిన మల్టీప్లెక్స్‌లు ఎట్టకేలకు శుక్రవారం తెరుచుకోనున్నాయి.