మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలు వీరే..
- IndiaGlitz, [Friday,June 07 2019]
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి 25 మందిని తన కేబినెట్లోకి తీసుకుంటున్నారు. వారి పేర్లు ఇప్పటికే దాదాపు ఖరారు కాగా.. మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ వారు సుమారు 10మందికి పైగా ఉన్నారు.
01. చిత్తూరు జిల్లా: నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా రెడ్డి
02. చంద్రగిరి ఎమ్మెల్యే : చెవిరెడ్డి భాస్కరరెడ్డి
03. నెల్లూరు : ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (వెంకటగిరి)
04. గుంటూరు : ఎమ్మెల్యే అంబటి రాంబాబు (సత్తెనపల్లి)
05. కర్నూలు జిల్లా : శిల్పా చక్రపాణి
06. పశ్చిమ గోదావరి : ఎమ్మెల్యే తెల్లం బాలరాజు (పోలవరం)
07. కడప జిల్లా : ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి (రాయచోటి)
08. రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
09. గుంటూరు జిల్లా : మర్రి రాజశేఖర్
10. అనంతపురం : అనంత వెంకట్రామిరెడ్డి
11. అనంతపురం : కాపు రామచంద్రారెడ్డి
కాగా.. మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే ఇక్కడ్నుంచి విడదల రజనీకి టికెట్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఆమెను గెలిపించుకుని వస్తే.. మర్రికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు మొదట మంత్రి పదవి ఇస్తానని మాటిచ్చింది కూడా ఈయనకే. అయితే ప్రస్తుతానికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినప్పటికీ సెకండ్ టెర్మ్లో కచ్చితంగా దక్కుతుందని.. నేను ఉన్నాను అంటూ జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది.