close
Choose your channels

కంగారొద్దు.. తరుణ్‌కు ప్రమాదం జరగలేదు!

Tuesday, August 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కంగారొద్దు.. తరుణ్‌కు ప్రమాదం జరగలేదు!

టాలీవుడ్ లవర్‌బాయ్ తరుణ్‌కు హైదరాబాద్‌ ఔటర్ రింగు రోడ్డుపై ప్రమాదం జరిగిందని.. ఆయనకు గాయాలయ్యాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు విన్న తరుణ్ సన్నిహితులు, బంధువులు, వీరాభిమానులు ఆందోళన చెందారు. అసలేం జరిగింది..? ఎలా ప్రమాదం జరిగింది..? అని అభిమానులు కంగారుపడ్డారు. అయితే ఈ విషయం ఆ చెవిన.. ఈ చెవిన పడి తరుణ్ కుటుంబ సభ్యుల దృష్టికి వెళ్లడంతో ఈ ప్రమాదంపై.. లవర్ బాయ్ తండ్రి చక్రపాణి క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ఉదయం చక్రపాణి ఓ ప్రకటన విడుదల చేశారు.

తరుణ్ స్పందన ఇదీ..
‘కొన్ని మీడియమ్స్‌లో నటుడు తరుణ్ కారుకు యాక్సిడెంట్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. నేను ప్రమాదం అనంతరం వేరే కారులో వెళ్లినట్లు కూడా కొన్ని చానెల్స్ వార్తలు టెలికాస్ట్ చేస్తున్నాయి. కానీ ఆ యాక్సిడెంట్ వార్త అవాస్తవం. యాక్సిడెంట్ అయిన కారుకు, నాకు సంబందంలేదు. రాత్రి నుంచి నేను ఇంటి వద్దే ఉన్నాను. నా కారు కూడా క్షేమంగానే ఉంది’ అని తరుణ్ స్పష్టం చేశారు.

క్లారిటీ ఇచ్చిన తరుణ్ తండ్రి..!
"తరుణ్‌కు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అభిమానులు కంగారు పడొద్దు. ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రమాదం జరిగిన కారుకి తరుణ్‌కి ఎటువంటి సంబంధం లేదు. కొన్ని మీడియా చానళ్లు తప్పుగా వార్తను ప్రసారం చేస్తున్నాయి. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము" అని తరుణ్ తండ్రి చక్రపాణి స్పష్టం చేశారు. అయితే ఈ వార్తలపై వార్తలు ప్రసారం చేసిన సదరు చానెల్స్ ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.