మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు


Send us your feedback to audioarticles@vaarta.com


దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తను చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీపై తను వ్యక్తిగత విమర్శలు చేయలేదని, వ్యక్తిగతంగా దూషించలేదని, ఆయన పుట్టుకతో బీసీ కాదని, అదే విషయాన్ని ప్రస్తావించానని అన్నారు.
మోదీపై తను చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వ్యక్తులు వక్రీకరించారని.. మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన కూడా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వీళ్లిద్దరి మధ్య కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు రేవంత్ రెడ్డి. మంత్రివర్గ విస్తరణపై ఈసారి కూడా ఎలాంటి చర్చ జరగలేదన్నారు సీఎం. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును తీసుకొస్తామని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments