మార్చి 31వరకు సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఉండవ్!

  • IndiaGlitz, [Saturday,March 21 2020]

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజానీకాన్ని గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 250కు పైగా దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. తెలుగు రాష్ట్రాలకూ పాకింది. రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా అనుమానిత కేసులు ఎక్కువవుతుండటంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశాయి. ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, స్కూల్స్, మాల్స్ ఇలా అన్నీ మూసేయగా.. బుధవారం నాడు ఏపీ సర్కార్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆపేస్తున్నట్లు ఫిలిం చాంబర్ పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. మొదట మార్చి 21 వరకే అనుకున్న పెద్దలు.. తర్వాత దీన్ని ఈ నెల 31వరుకు పొడిగించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అంటే.. మరో పది రోజులపాటు సినిమా రిలీజ్‌లు, షూటింగ్స్ ఉండవన్న మాట.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం చాంబర్ కార్యవర్గం ఆ ప్రకటనలో నిశితంగా వివరించింది.వెల్లడించింది. అయితే.. ఎప్పట్నుంచి షూటిగ్స్, సినిమా రిలీజ్‌లు అనే విషయంపై మరికొన్ని రోజుల్లో మరోసారి సమావేశమై పరిస్థితిపై తాజా సమీక్ష నిర్వహిస్తామని ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రకటనను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ & మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పేరిట ప్రకటనను విడుదల చేయడం జరిగింది.

More News

'క‌రోనా' లేని భార‌తావనిని సాధిద్దాం: చిరంజీవి

మహమ్మారి కరోనా అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ప్రధాని పిలుపు.. రేపు 5గంటలకు దద్దరిల్లిపోవాలి!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ పలు సలహాలు, సూచనలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ఇచ్చిన పిలుపుకు

వ‌దంతుల‌ను న‌మ్మ‌కండి..చిరు 152పై నిర్మాత‌ల వివ‌ర‌ణ‌

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ‘ఆచార్య‌’ పేరుతో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ప‌తాకాల‌పై

ఈ ల్యాబ్‌ను కరోనా టెస్ట్‌లకు వాడుకోండి..: మోదీకి కేసీఆర్ విజ్ఞప్తి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విషయంలో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు మందు ఇదేనా..!?

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ ఇంత వరకూ అందుబాటులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రయోగాలు మాత్రం ఇంకా ప్రపంచ దేశాలు చేస్తూనే ఉన్నాయి.