సంక్రాంతి కాదు.. వేస‌వి

  • IndiaGlitz, [Monday,June 25 2018]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది వేస‌వికి భ‌ర‌త్ అనే నేను అంటూ ప‌ల‌క‌రించి మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో యువ ముఖ్య‌మంత్రి భ‌ర‌త్ రామ్‌గా త‌న అభిన‌యంతో అభిమానుల్నే కాకుండా స‌గ‌టు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు మ‌హేష్‌.ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డెహ్ర‌డూన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మ‌హేష్ ఎంబీఏ స్టూడెంట్‌గా క‌నిపించ‌నున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాని సంక్రాంతికి విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఆ మ‌ధ్య కొన్ని వార్త‌లు వినిపించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజా స‌మాచారం ప్రకారం.. ఈ సినిమా వ‌చ్చే ఏడాది వేస‌వి ఆరంభంలో వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. మరి.

ఈ వార్త‌ల్లో ఎంత నిజముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందిస్తున్నాడు.