ఇప్పుడు హత్య కేసుకు మెడకు చుట్టుకుంది...

  • IndiaGlitz, [Thursday,July 13 2017]

మ‌ల‌యాళ న‌టి భావ‌న కిడ్నాప్‌, లైంగిక దాడి కేసులో న‌టుడు దిలీప్‌ను పోలీసులు క‌స్ట‌డీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే.తాజాగా మ‌ల‌యాళ న‌టుడు క‌ళాభ‌వ‌న్ మ‌ణి హ‌త్య కేసు కూడా దిలీప్ మెడ‌కు చుట్టుకుంది. క‌ళాభ‌వ‌న్ మ‌ణి కొన్ని రోజుల క్రితం విష ప్ర‌యోగం వ‌ల్ల మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించి కేసు విచార‌ణ‌లోనే ఉంది.

ఈ నేప‌థ్యంలో క‌ళాభ‌వ‌న్ మ‌ణి సోద‌రుడు రామ‌కృష్ణ‌న్‌, ద‌ర్శ‌కుడు బైజు కొట్టార‌క్క‌క దిలీప్‌పై ఆరోప‌ణ‌లు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయంటూ వారు తెలియ‌జేశారు. భూముల విష‌యంలో దిలీప్‌, క‌ళాభ‌వ‌న్ మ‌ణికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగాయని ఈ క్ర‌మంలోనే క‌ళాభ‌వ‌న్ మ‌ణి హత్య‌కు గురైయ్యాడ‌ని, దిలీప్‌ను విచారించాల‌ని వారు కోరుతున్నారు.