Agnipath protest: సికింద్రాబాద్‌ ఆందోళనతో మాకు సంబంధం లేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్ఎస్‌యూఐ

  • IndiaGlitz, [Friday,June 17 2022]

యువత, సాంకేతికతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామక ప్రక్రియలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ‘అగ్నిపథ్‌’ పేరుతో కొత్త సర్వీసును ప్రారంభించింది. నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసుకు సంబంధించిన నియామక ప్రణాళికను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి ఇటీవల ఆవిష్కరించారు. అయితే దీని వల్ల భవిష్యత్‌కు భరోసా లేకుండా పోతుందని.. నాలుగేళ్ల తర్వాత తమ పరిస్ధితి ఏంటంటూ ఆర్మీ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత మండిపడుతున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ రెండ్రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల ఇవి హింసాత్మకంగా మారాయి.

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రణ రంగం:

శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉదయాన్నే భారీగా స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా పలు రైళ్లకు నిప్పు పెట్టడంతో పాటు అద్దాలు పగులగొట్టారు. వీరిని అదుపు చేసేందుకు తొలుత టియర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. అయినప్పటికీ పరిస్ధితి అదుపులోకి రాకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. అయితే ఈ ఆందోళనకు ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలే కారణమంటూ ప్రచారం జరిగింది.

సికింద్రాబాద్ ఆందోళనతో మాకు సంబంధం లేదు : ఎన్‌ఎస్‌యూఐ

అయితే ఈ కథనాలను ఎన్ఎస్‌యూఐ తెలంగాణ అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘అగ్నిపత్ పరీక్ష రద్దు కావడం వల్ల గత 48 గంటల్లో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఆ విద్యార్థులు ఆవేశానికి లోనయి ఈ ఘటనకు పాల్పడడం జరిగింది. ఈ సంఘటనకు ఎన్ఎస్‌యఐకి ఎలాంటి సంబంధం లేదు, ఆ వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నా. అందుకే పోలీస్ స్టేషన్ లో ఉండి కూడా ఈ వీడియో ద్వారా తెలియచేస్తున్నా. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించే కార్యకలాపాలను చేయవద్దని తోటి విద్యార్థులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఉదయం ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ కి వెళుతుండగా నన్ను పోలీసులు అరెస్టు చేసి నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరువాత షా ఇనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ కు తరలించారని వెంకట్ ఆ వీడియోలో తెలిపారు.’’

More News

Agnipath protest: రణరంగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్... పలు రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ

భారత సైన్యంలో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌ను నిరసిస్తూ శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

Agnipath protest: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆందోళన హింసాత్మకం.. పోలీసుల కాల్పులు, ఒకరి మృతి

సాయుధ బలగాల్లో ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీమ్‌పై దేశవ్యాప్తంగా యువత, ప్రజా సంఘాలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. నిన్న ఉత్తరాదిలో జరిగిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు

Janasena Party : వచ్చీ రాగానే ఆ చట్టాన్ని మార్చేశారు.. మరి కౌలు రైతుల గతేంటీ : జగన్‌పై నాదెండ్ల ఆగ్రహం

రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం గుంటూరులో

Janasena Party : వచ్చీ రాగానే ఆ చట్టాన్ని మార్చేశారు.. మరి కౌలు రైతుల గతేంటీ : జగన్‌పై నాదెండ్ల ఆగ్రహం

రాష్ట్రంలో కౌలు రైతుల గుర్తింపు జరగడం లేదన్నారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. గురువారం గుంటూరులో

Janasena : జగన్ గారూ.. సాయంలోనూ కులాలా, వాళ్లని రైతులే కాదంటారా : నాదెండ్ల మనోహర్ విమర్శలు

కేంద్రం అందించే రైతు భరోసా సాయంలోనూ రాష్ర్ట ప్రభుత్వం కులాలను చూస్తోందని ఆరోపించారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.