ప్రీ రిలీజ్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వచ్చేస్తున్నాడహో..!

  • IndiaGlitz, [Sunday,January 05 2020]

అవును ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చేస్తున్నాడు.. ఇంతకీ ఏ ఈవెంట్‌కు వస్తున్నాడబ్బా..?.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’కు వస్తున్నాడా..? లేకుంటే స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురంలో..’ ఈవెంట్‌కు వస్తున్నాడా..? అనేగా మీ సందేహం.. ఆ రెండూ కూడా కాదండోయ్.. నందమూరి కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచి వాడవురా’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు వస్తున్నాడు.

సరిలేరు కాదండోయ్!

వాస్తవానికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు సంబంధించి రెండు ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లు జరుగుతాయని ఓ దానికి మెగాస్టార్ చిరంజీవి.. మరో ఈవెంట్‌కు యంగ్ టైగర్ వస్తారని గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయ్. అయితే ఈ వార్త విన్న యంగ్ టైగర్, సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే.. జరిగేది ఒక్క ఈవెంటే అని తేలిపోయింది.

అన్న కోసం తమ్ముడొస్తున్నాడు!

తాజాగా.. ఎంత మంచివాడవురా చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ఈ నెల 8న జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తున్నాడని అధికారికంగా ప్రకటించింది. ఈ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. కాగా.. సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ చేయలేదు.. దీంతో ఎన్టీఆర్‌కు రంగంలోకి దింపితే కలిసొస్తుందని భావించిన దర్శకనిర్మాతలు.. జూనియర్‌ను రప్పిస్తున్నారు. మొత్తానికి చూస్తే.. జూనియర్ రాకతో సినిమాకు మంచి హైప్ వస్తుందని చిత్రయూనిట్ బాగానే నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే..‘ఎంత మంచివాడవురా’ చిత్రాన్ని సతీష్ విగ్నేశ తెరకెక్కించగా.. హీరోయిన్‌గా మెహ్రీన్ నటిస్తోంది. ఆదిత్య మ్యూజిక్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీని ఉమేష్ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

More News

సరిలేరు రిలీజ్‌కు ముందే అనిల్‌కు పండుగొచ్చింది!!

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్‌ కానుంది. అంటే సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ పండుగేనన్న మాట.

అదే ఆమిర్ క‌మిట్‌మెంట్‌

బాలీవుడ్ క‌థానాయ‌కుడు ఆమీర్‌ఖాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. డిఫరెంట్ సినిమాలు చేసే ఆమిర్‌ఖాన్ పాత్ర కోసం ఎంత‌టి రిస్క్ చేయ‌డానికైనా వెనకాడ‌డు. ప్ర‌స్తుతం ఆయ‌న హాలీవుడ్ చిత్రం

శ్రీదేవి చ‌నిపోయింది అందుకేనా?

అటు బాలీవుడ్‌లో, ఇటు ద‌క్షిణాదిన అగ్ర‌తార‌గా వెలుగొందిన ఫిబ్ర‌వ‌రి 24, 2018న దుబాయ్‌లోని ఓ హోట‌ల్‌లోని బాత్‌ట‌బ్‌లో పడి ప్ర‌మాద‌వ‌శాతు అకాల మ‌ర‌ణం పొందారు.

పేరు మార్పు క‌లిసొస్తుందా నాయ‌నా!

సినిమా రంగంలో ఎంత మంది ఎంత క‌ష్ట‌ప‌డ్డార‌నేది ఎంత ముఖ్య‌మో చిన్న మ్యాజిక్ కోసం వెయిట్ చేయ‌డం అనేది కూడా కామ‌నే!. దాన్నే సెంటిమెంట్ అంటుంటారు. సినిమా రంగంలో ఇలాంటి సెంటిమెంట్

నా జీవితం గ‌తం కంటే ఎంతో బావుందంటున్న స్టార్

కొంద‌రు స్టార్స్ మాట్లాడుతుంటే ఎలాంటి దాప‌రికం ఉండ‌దు. నేరుగా మాట్లాడేస్తారు. కానీ మ‌రికొంద‌రు మాత్రం చాలా దాప‌రికంగా మాట్లాడుతుంటారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ రెండు కేటగిరీకి చెందిన వాడు. రీసెంట్‌గా