ఎన్టీఆర్..విమర్శకులపై నోరు జారాడా?

  • IndiaGlitz, [Tuesday,September 26 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం 'జై ల‌వ‌కుశ‌'. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 21న విడుద‌లైంది. అయితే విడుద‌ల రోజు డివైడ్ టాక్ వ‌చ్చింది. కొంత మంది రివ్యూ రైట‌ర్స్ సినిమా బావుంద‌ని అంటే మ‌రికొంద‌రు బాగా లేద‌ని అన్నారు. ఈ విష‌యంపై ఎన్టీఆర్ సినిమా స‌క్సెస్ మీట్‌లో స్పందించాడు. సినిమాను ఎమెర్జ‌న్సీ ఉన్న పెషంట్‌గా, బంధువులు, చుట్టాలుగా చిత్ర‌యూనిట్‌ను, డాక్ట‌ర్స్‌గా ప్రేక్ష‌కుల‌గా పోల్చిన ఎన్టీఆర్ రివ్యూ రైట‌ర్స్‌ను మాత్రం దారిన పోయే దాన‌య్య‌లు అంటూ మండిప‌డ్డాడు.

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంస్కృతి మొదలైంది. విడుదలైన సినిమా ఎమెర్జెన్సీలోని పెషంట్‌ అయితే, పెషంట్‌పైనే అసలు పెట్టుకున్న బంధువులు, చుట్టాలు మేము, డాక్టర్స్‌ ప్రేక్షకులు అయితే దారిన పోయే దానయ్యలు కొంత మంది విశ్లేషకులు. పెషంట్‌ చచ్చిపోతాడా? లేదా? అని చెప్పాల్సింది డాక్టర్లనే ప్రేక్షకులు. ఇది మాకే కాదు, మా అందరికీ జరుగుతున్న ప్రక్రియ. మనం మాట్లాడే మాట, ఎదుటి వ్యక్తి పరిస్థితిని ఎంత దిగజారుస్తుందో ఆలోచించండి. తప్పులుంటే క్షమించండి, అర్థమే లేదనుకంటే వదిలేయండిస‌స అన్నారు. సినిమా రివ్యూల‌న్న త‌ర్వాత న‌చ్చిన‌వాడికి న‌చ్చిన‌ట్లు రాస్తారు. దీని కోసం ఇంత పెద్ద‌గా ఎందుకు రియాక్ట్ అయ్యారో తెలియ‌డం లేద‌ని కొంద‌రు అంటున్నారు.

More News

'స్పైడర్' కోసం ఎగ్జయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నాను - మహేష్

సూపర్ స్టార్ మహేష్,ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్ లో ఠాగూర్ మధు సమర్పణలో

మూడు సినిమాల‌తో రాశి

తాజాగా విడుద‌లైన ఎన్టీఆర్‌ జైల‌వ‌కుశ‌లో  ప్రియ పాత్ర‌లో సంద‌డి చేసింది రాశి ఖ‌న్నా. అందులో ట్రింగ్ ట్రింగ్ అంటూ సాగే పాట‌లో త‌న అందాల‌తో కుర్ర‌కారుని క‌వ్వించింది. ఇదిలా ఉంటే.. వ‌చ్చే నెల‌లో ఈ ముద్దుగుమ్మ న‌టించిన మూడు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి.

'వాడేన' టీజర్ విడుదల

నిర్మాని ఫిలిమ్స్ బ్యానర్ పై శివ్ తాండల్,నేహా దేశ్ పాండే ,అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా పోషిస్తున్న వాడేనా

భారీ షెడ్యూల్ పూర్తి చేసుకొన్నబాల‌కృష్ణ చిత్రం

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న‌ 102వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత  సి.కళ్యాణ్ సి.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నిర్మిస్తున విషయం తెలిసిందే. కుంభ‌కోణంలో ఓ భారీ షెడ్యూల్ జ‌రుపుకొంటోంది.

బిగ్‌బాస్ విజేత‌గా శివ‌బాలాజీ...

బుల్లితెర సెన్సేష‌నల్ అంటూ ప్రారంభమైన రియాలిటీ షో బిగ్‌బాస్‌. హిందీ వెర్ష‌న్‌కు అనుగుణంగా తెలుగులో కూడా స్టార్ మా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం.