Kantamaneni Uma Maheswari : కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్య.. ధ్రువీకరించిన పోలీసులు

  • IndiaGlitz, [Monday,August 01 2022]

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం నందమూరి కుటుంబాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. తొలుత అనారోగ్యం కారణంగా ఆమె చనిపోయినట్లుగా వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లుగా పోలీసులు ప్రకటించారు. మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలతో జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె దీక్షిత కూడా ధృవీకరించారు. మధ్యాహ్నం తన గదిలోకి వెళ్లిన తన తల్లి.. ఎంతకు బయటకు రాకపోవడంతో తలుపులు బద్ధలుకొట్టి చూశామని ఆమె తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 2.30కి పోలీసులకు సమాచారం అందించినట్లు దీక్షిత తెలిపారు. ఉమామహేశ్వరి మరణంపై పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు.

ఎల్లుండి అంత్యక్రియలు:

ఉమామహేశ్వరికి భర్త శ్రీనివాస్ ప్రసాద్, ఇద్దరు కుమార్తెలు వున్నారు. ఇటీవలే చిన్న కుమార్తెకు వివాహం చేయగా.. పెద్ద కుమార్తెకు విదేశాల్లో వుంటున్నారు. ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే ఉమామహేశ్వరి మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. ఎల్లుండి ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

నాలుగేళ్ల క్రితం హరికృష్ణ దుర్మరణం:

2018 ఆగస్ట్ 29న ఎన్టీఆర్ కుమారుడు , మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ కోదాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి అన్నగారి కుటుంబం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తాజాగా ఉమామహేశ్వరి కన్నుమూయడంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

More News

kantamaneni uma maheswari : ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం.. శోకసంద్రంలో అన్నగారి ఫ్యామిలీ

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె కంఠమనేని ఉమా మహేశ్వరి సోమవారం హఠాన్మరణం చెందారు.

Janasena : అమ్ముడుపోతారంటూ జగన్ వ్యాఖ్యలు.. కాపు నాయకులకు పౌరుషం లేదా: జనసేన నేత విజయ్ కుమార్

కాపుల సంక్షేమానికి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్. హైదరాబాద్‌లోని జనసేన కేంద్ర కార్యాలయంలో శుక్రవారం

Janasena : పరామర్శలో పళ్లికిలిస్తారా.. అది మన బటన్ రెడ్డికే సాధ్యం : జగన్‌పై జనసేన నేత రియాజ్ సెటైర్లు

కాపు సామాజిక వర్గంతోపాటు రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలను వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ షేక్ రియాజ్. శుక్రవారం హైదరాబాద్‌లోని జనసేన

Janasena : కాపులు ఓట్లు అమ్ముకున్నారా, రుజువు చేయకుంటే ... జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: పంతం నానాజీ

మొదటి నుంచి కాపులను కించపరచడానికి.. వారిని అవహేళన చేయడానికి మాత్రమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు జనసేన పీఏసీ సభ్యులు పంతం నానాజీ. కాకినాడ

దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది: అశ్వనీదత్

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'.