బాలీవుడ్ కి వెళుతున్న ఎన్టీఆర్ చిత్రం

  • IndiaGlitz, [Saturday,November 28 2020]

తెలుగు సినిమాల కంటెంట్ మారుతోంది. డిఫరెంట్ సినిమాలు చూడటానికి ప్రేక్ష‌కులు ఆస‌క్తి చూపిస్తుండ‌టంతో మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు కూడా అలాంటి సినిమాలు చేయ‌డానికే ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో బాలీవుడ్ స‌హా ఎంటైర్ ఇండియాలోని ఇత‌ర సినీ ప‌రిశ్ర‌మ‌లు సైతం మ‌న సినిమాల‌ను రీమేక్ చేయ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాయి. రీసెంట్‌గా చాలా సినిమాలు బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్నాయి. మంచి ఆదరణనను దక్కించుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో బాలీవుడ్‌లో రీమేక్ కావ‌డానికి మ‌రో రెండు సినిమాలు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

అందులో యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ‘ఊస‌ర‌వెళ్లి’ సినిమా ఒక‌టి. మ‌రో చిత్రం తెలుగులో చిన్న చిత్రంగా రూపొంది, అంద‌రికీ ప్ర‌శంస‌లు ద‌క్కించుకున్న ‘మిథునం’. ఈ చిత్రంలో ఎస్పీబీ, ల‌క్ష్మి న‌టించారు. దీనికి తనికెళ్ల భరణి దర్శకుడు. బాలీవుడ్‌లో ఎస్పీబీ పాత్ర‌ను అమితాబ్ బ‌చ్చ‌న్ పోషించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఆయనకు జతగా రేఖ నటిస్తుందని అంటున్నారు. అలాగే ‘ఊసరవెళ్లి’ రీమేక్‌లో అక్షయ్ కుమార్ నటించే అవకాశాలున్నాయంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు ఏంటి? అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.