'ఎన్టీఆర్-కథానాయకుడు' సెన్సార్ పూర్తి.. జనవరి 9న విడుదల

  • IndiaGlitz, [Friday,January 04 2019]

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్-కథానాయకుడు చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుని 'U' సర్టిఫికేట్ ని పొందింది.. ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండా 2 గంటల యాభై నిమిషాల నిడివితో చిత్రం జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది..

విద్యాబాలన్, ప్రకాష్ రాజ్, రానా దగ్గుబాటి , సుమంత్, కళ్యాణ్ రామ్ తదితరులు చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తుండగా, జాగర్లమూడి క్రిష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్ తో మంచి స్పందన దక్కించుకోగా సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.. ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, జ్ఞాన శేఖర్ వీఎస్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, విద్యా బాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గబాటి, సుమంత్, ప్రకాష్ రాజ్, నరేష్ వికె, మురళీ శర్మ, కైకాల సత్యనారాయణ, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యా మీనన్, బ్రహ్మానందం తదితరులు.

More News

క్రిష్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

టాలీవుడ్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీస్‌లో ఎన్టీఆర్ బయోపిక్ ఒక‌టి. ఈ దివంగ‌త ముఖ్య‌మంత్రి జీవిత చ‌రిత్ర‌ను `య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు`,

దిల్‌రాజు ..రెండు ఒకేసారి!

అగ్ర నిర్మాత‌ల్లో ఒక‌రైన దిల్‌రాజు ఇప్పుడు రెండు సినిమాల‌ను ట్రాక్‌లో ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు.

క‌పిల్‌దేవ్‌లో శ్రీకాంత్‌గా జీవా!

మన దేశానికి తొలిసారి క్రికెట్ ప్రపంచ కప్పును అందించింది కపిల్‌దేవ్. ఈయన నాయకత్వంలో 1983లో ఎలాంటి అంచనాలు లేని భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది.

పూరీ జగన్నాథ్, రామ్ ఇస్మార్ట్ శంక‌ర్..

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేష‌న్ లో ఓ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ వ‌స్తుంది. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. దీనికి ఇస్మార్ట్ శంక‌ర్ అనే టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేసారు.

నా జర్నీలో సపోర్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు - బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌

'అల్లుడు శీను' చిత్రంతో సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో టాలీవుడ్‌లోకి హీరోగా అడుగుపెట్టి సూపర్‌హిట్‌ అందుకున్న యువ కథానాయకుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.