ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ తో సినిమా చేస్తున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్

  • IndiaGlitz, [Saturday,May 20 2017]

ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ నిర్మాత‌గా మారారు. యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా, స‌క్సెస్‌ఫుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించ‌నున్నారు. ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్‌' అందుకున్న విజ‌యాన్ని ఇంకా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ మ‌ర్చిపోలేదు. అంత‌లోనే ఈ స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌లో మ‌రో సినిమా షురూ కానుండ‌టం సినీ ప్రియుల‌కు, అభిమానుల‌కు పండుగే.
యువ‌సుధ‌ ఆర్ట్స్ ప‌తాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్న మిక్క‌లినేని సుధాక‌ర్ మాట్లాడుతూ ''ఎన్నెన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఆ అనుభవం తో నిర్మాత గా మారుతున్నాను. నా చిన్న నాటి స్నేహితుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో నా తొలి చిత్రాన్ని నిర్మించ‌డం మరియు ఇందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా నటించడం ఆనందం గా ఉంది. వారిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్‌'ను ప్రేక్ష‌కులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. ఆ చిత్రాన్ని మించేలా, ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీగా, మైలురాయిలా నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తాం. మిగిలిన అన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం'' అని అన్నారు.

More News

హ్యాపీ బర్త్ డే టు యంగ్ టైగర్ ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్...పేరులోనే పవర్ ఉంది

ఇప్పుడు విడుదల చేసిన ఎన్టీఆర్ లుక్ అదే...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కె.రవీంద్ర దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై

1500 కోట్ల 'బాహుబలి-2'

తెలుగు ప్రేక్షకుడంటే కమర్షియల్ సినిమాలను ఆదరించే ప్రేక్షకుడని,కొత్తదనానికి పెద్ద పీట వేయడని,

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ కలెక్షన్స్ సాధించిన 'బాహుబలి-2'

ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ 'బాహుబలి-2'

'ఒక్కడు మిగిలాడు' చిత్రంలోని మంచు మనోజ్ సెకండ్ లుక్ విడుదల

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం "ఒక్కడు మిగిలాడు".