మ‌ల‌యాళం నేర్చుకుంటున్న యంగ్ టైగ‌ర్‌..!

  • IndiaGlitz, [Wednesday,April 22 2020]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ఈ చిత్రంలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. భారీ బడ్జెట్‌, హైటెక్నిక‌ల్ వేల్యూస్‌తో తెర‌కెక్క‌తోన్న ఈ సినిమాకు సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్‌, భీమ్ ఫ‌ర్ రామ‌రాజు వీడియో ప్రోమో విడుద‌లైంది. ఈ ప్రోమోను తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ప్రోమోలో రామ్‌చ‌ర‌ణ్ వీడియోకు తార‌క్ వాయిస్ ఓవ‌ర్‌ను అందించారు.

అస‌లు విష‌య‌మేమంటే ఐదుభాష‌ల్లో మ‌ల‌యాళం త‌ప్ప మిగిలిన భాష‌లన్నింటికీ ఎన్టీఆర్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. అయితే ఇప్పుడు మ‌ల‌యాళంపై తార‌క్ ఫోక‌స్ పెట్టాడ‌ట‌. మ‌ల‌యాళంను నేర్చుక‌నే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ట తార‌క్‌. అందుకు త‌గిన‌ట్లు క్వారంటైన్ కూడా ఆయ‌న‌కు క‌లిసొచ్చింద‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి సినిమాకు ఐదు భాష‌ల్లో తార‌క్ చెబుతాడో లేదో అని తెలియాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే. సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 8న విడుద‌ల చేయాల‌ని చిత్ర యూనిట్ భావించింది. అయితే క‌రోనా ప్ర‌భావంతో సినిమా విడుద‌ల ఆల‌స్య‌మ‌య్యేలానే క‌న‌ప‌డుతోంది.

More News

చిరుకు నో చెప్పి.. రవితేజకు త్రిష గ్రీన్ సిగ్నల్!?

సీనియర్ నటి త్రిష తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించి తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నటించి చాలా రోజులైంది.

కెప్టెన్‌ విజయ్‌కాంత్ పెద్ద మనసు.. పవన్ అభినందన

కోలీవుడ్ సూపర్ స్టార్ ఓ వెలుగు వెలిగిన నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కష్టకాలంలో తనకు తోచినంత సాయం చేసేందుకు

చెల్లెలికు సాయిప‌ల్ల‌వి ప్రేమ‌లేఖ‌

విల‌క్ష‌ణ న‌ట‌న‌తో హీరోయిన్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకుంది సాయిప‌ల్ల‌వి. త‌న ఫ్యామిలీతో ప్ర‌స్తుతం క్వారంటైన్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తోంది

వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్లు జైలు శిక్ష..: కేంద్ర ప్రభుత్వం

కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనా రోగులు, వారి బంధువులు

బాల‌య్య 106కు కొత్త చిక్కులు..?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 106 చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. తొలి షెడ్యూల్ పూర్త‌యిన ఈ సినిమా క‌రోనా వైర‌స్ ప్ర‌భావం