బాహుబలిని ఆకాశానికెత్తేసిన ఎన్టీఆర్...

  • IndiaGlitz, [Friday,April 28 2017]

విజువ‌ల్ వండ‌ర్‌గా రూపొందిన 'బాహుబ‌లి 2' సినిమా ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. సినిమా సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో క‌లెక్ష‌న్స్ సునామీని క్రియేట్ చేస్తుంది. సినిమాను చూసిన సినీ ప్ర‌ముఖుల్లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముందుగా సినిమాపై త‌న స్పంద‌న‌న‌ను తెలియ‌జేశాడు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిని త‌న ట్వీట్ల‌తో ఆకాశానికెత్తేశాడు.

బాహుబ‌లి 2 సినిమా ఇండియ‌న్ సినిమాలోనే ఫైనెస్ట్ కాన్వాస్ అని చెప్పిన ఎన్టీఆర్ తెలుగు సినిమానే కాదు, ఇండియ‌న్ సినిమాను కూడా నెక్స్‌ట్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళాడు. రాజ‌మౌళి విజ‌న్‌ను ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ స‌హా ఇత‌ర న‌టీన‌టులు త‌మ గొప్ప న‌ట‌న‌తో నిజం చేసేలా స‌హ‌కారం అందించారు. ఎం.ఎం.కీర‌వాణి ప్ర‌తి ఫ్రేమ్‌కు త‌న మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. రాజ‌మౌళి క‌ల‌ను నిజం చేసేందుకు అడిగినంత బ‌డ్జెట్ ఇచ్చి నిర్మాత‌లు శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్ర‌సాద్ దేవినేనిలు స‌పోర్ట్ చేశారంటూ అభిన‌దించాడు. రాజ‌మౌళి అంటే ఎన్టీఆర్‌కు చాలా అభిమానం అనే సంగ‌తి తెలిసిందే ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ హిట్స్ అయిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, య‌మ‌దొంగ చిత్రాల‌ను రాజ‌మౌళియే డైరెక్ట్ చేశాడు.

More News

మెగాభిమానులు, ప్రభాస్ అభిమానుల మధ్య ఘర్షణ

బాహుబలి2 విడుదల సందర్భంగా అమలాపురంలో మెగాభిమానులు,ప్రభాస్ అభిమానులు మధ్య ఘర్షణ జరిగింది.

'బాహుబలి 2' ట్రెండ్ క్రియేటర్...

ప్రభాస్,అనుష్క,రానా,తమన్నాతారాగణంగా రాజమౌళి దర్శకత్వంలో

'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'.

వినోద్ ఖన్నాకన్నుమూత...

సీనియర్ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.

ఐదేళ్ళ సమయం పడుతుందని తెలుసుంటే 'బాహుబలి' మొదలు పెట్టే వాళ్లమే కాదు - ఎస్.ఎస్.రాజమౌళి

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బాహుబలి 2'.