అంతా తూచ్ అంటున్న ఎన్టీఆర్
- IndiaGlitz, [Saturday,June 15 2019]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ ఆర్ ఆర్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించే సినిమా 'సఖి'(వినపడుతున్న పేరు)లో గెస్ట్ అప్పియరెన్స్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అందుకు కారణంగా కీర్తి సురేష్ సినిమా నిర్మాత మహేష్ కొనేరుతో ఉన్న అనుబంధమే కారణమని వార్తల్లో పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ పి.ఆర్ టీం మాత్రం ఈ విషయాన్నిలైట్గా తీసుకుంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గెస్ట్ అప్పియరెన్స్పై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేల్చేశారు.
'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. మెగాపవర్స్టార్ రామ్చరణ్ ఇందులో అల్లూరి సీతారామరాజుగా కనపడతారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న విడుదలవుతుంది.