ఎన్టీఆర్ ఏడోసారి ఆ ప‌ని చేయ‌నున్నారా?

  • IndiaGlitz, [Saturday,March 10 2018]

ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్‌ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌తో ఓ పాట పాడించమని తమన్‌కు నంద‌మూరి అభిమానుల నుంచి చాలా రిక్వెస్ట్స్‌ వస్తున్నాయ‌ట‌.

అందుకు తమన్ కూడా ఓకే చెప్తున్నారు. ఇంత‌కుముందు తమన్ సంగీత సారథ్యంలో 'రభస' చిత్రం కోసం "రాకాసి రాకాసి" అంటూ గొంతు సవరించుకున్నారు ఎన్టీఆర్. అంతేగాకుండా.. కన్నడ సినిమా 'చక్రవ్యూహ'లో తమన్ స్వరపరచిన "గేలియ గేలియ" పాటను కూడా పాడారు యంగ్ టైగర్. ఈ పాటకుగాను తార‌క్‌కు సింగింగ్ సెన్సేష‌న్ స్టార్‌ అవార్డు రావడం కూడా విశేషం.

కాగా, త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబో సినిమాకి సంగీతమందించడాన్ని తన డ్రీమ్‌గా చెప్పుకొస్తున్న తమన్.. ఈ సినిమాలో కూడా ఎన్టీఆర్ గళాన్ని వినిపించడానికి సిద్ధమ‌వుతున్నార‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. అదే గ‌నుక జ‌రిగితే.. కెరీర్ మొత్త‌మ్మీద ఇప్ప‌టివ‌ర‌కు ఆరు పాటలు పాడేసిన ఈ టాలెంటెడ్ హీరోకి ఈ చిత్రం కోసం పాడే పాట ఏడోది అవుతుంది.

ఇప్ప‌టికే.. ఈ సినిమాలో పాటలన్నీ ఆకట్టుకుంటాయని ముందుగానే మాట కూడా ఇచ్చేసారు తమన్. ప‌నిలో ప‌నిగా మూడు "టి"(తారక్, త్రివిక్రమ్, తమన్)ల కలయికలో రూపొందుతున్న ఈ సినిమాకి మరో "టి"("ట్రస్ట్")ని జోడించమంటున్నారు స‌ద‌రు యువ సంగీత సంచ‌ల‌నం.

More News

నాగ్‌, నాని కెమిస్ట్రీనే ఓ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రల్లో ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ పతాకంపై సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మిస్తున్నారు.

మార్చి17 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'మనసైనోడు'

మనోజ్ నందన్, ప్రియసింగ్ హీరో హీరోయిన్ గా హెచ్. పిక్చర్స్ పతాకం పై హస్సేబుద్దిన్ నిర్మాతగా, సత్యవరపు వెంకటేశ్వరరావుని  దర్శకుడిగా పరిచయం చేస్తు నిర్మించిన చిత్రం 'మనసైనోడు'. ఇటీవల ఈ చిత్రo సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని  ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నారు.

​జూన్ 15న 'స‌మ్మోహ‌నం'

అనూహ్య‌మైన క‌థాంశంతో ఆద్యంతం వినోదాత్మ‌కంగా తెర‌కెక్కుతోన్న కొత్త త‌రం ప్రేమ క‌థా చిత్రం 'స‌మ్మోహ‌నం' జూన్ 15న విడుద‌ల కానుంది. సుధీర్‌బాబు హీరోగా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో  శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

యాక్ష‌న్‌లోకి దిగిన మాస్ మ‌హారాజా

మాస్ మ‌హారాజా రవితేజ సినిమా అంటేనే కావలసినంత వినోదం. మంచి కామెడీ టైమింగ్‌తో పాటు తన మార్క్‌ యాస డైలాగులతో తెరపై సందడి చేస్తారాయ‌న‌. ఇక ఈ మాస్ మహారాజా సినిమాలో ఫైట్లు కూడా తన డైలాగుల్లాగే మాస్ గానే ఉంటాయి.

ఫిజిక్స్ ప్రొఫెస‌ర్‌గా వెంక‌టేష్‌

పాతికేళ్ళ క్రితం వ‌చ్చిన 'సుందరకాండ' (1992) సినిమాలో లెక్చరర్‌గా కనిపించి.. తన మార్క్‌ కామెడీతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా అలరించారు విక్ట‌రీ వెంకటేష్. మళ్ళీ ఇన్నాళ్ళకి ప్రొఫెసర్‌గా తెరపై సందడి చేయడానికి సిద్ధ‌మ‌వుతున్నారాయ‌న‌.