హ్యాట్రిక్ కొట్టనున్న ఎన్టీఆర్

  • IndiaGlitz, [Monday,September 25 2017]

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం జైల‌వ‌కుశ మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ వ‌ద్ద దండ‌యాత్ర చేస్తోంది. అంతేకాకుండా.. తార‌క్ కెరీర్‌లో కొన్ని కొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది. ఇప్ప‌టికే ఓవ‌ర్‌సీస్ మార్కెట్లో వ‌రుస‌గా నాలుగు మిలియ‌న్ డాల‌ర్ మూవీస్‌ని సొంతం చేసుకున్న తార‌క్‌.. మ‌రో కొత్త రికార్డుకి సిద్ధ‌మవుతున్నాడు. అదేమిటంటే.. వ‌రుస‌గా మూడు రూ.50 కోట్ల సినిమాల‌ను సొంతం చేసుకున్న తొలి తెలుగు హీరో అనిపించుకున్నాడు.

నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తాగ్యారేజ్ చిత్రాల‌తో రూ.50 కోట్ల షేర్‌ క్రెడిట్‌ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌.. జైల‌వ‌కుశ విష‌యంలో ఆదివారం నాటికి వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ.50 కోట్ల షేర్‌ని సొంతం చేసుకున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన జైల‌వ‌కుశ‌లో రాశి ఖ‌న్నా, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. త‌మ‌న్నా ఓ ప్ర‌త్యేక గీతంలో మెరిసింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీత‌మందించాడు.

More News

ఆ క్రెడిట్ మహేష్ దే

ఓవర్ సీస్ లో సూపర్ స్టార్ మహేష్బాబుకి ఉన్న క్రేజే వేరు.సినిమా ఎలా ఉన్నా..

పారిస్ పారిస్ అంటున్న కాజల్

ఖైదీ నెం.150,నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకుంది టాలీవుడ్ చందమామ కాజల్.

మెగాస్టార్ ఠాగూర్ కి 14 ఏళ్లు

ఇంద్ర వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన చిత్రం ఠాగూర్.

పూరి తనయుడి కోసం కొత్త హీరోయిన్...

హీరోల ను మాస్ యాంగిల్ లో ప్రెజంట్ చేసే దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు.

మహేష్ బాబు బాటలో త్రిష..

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన అతడు,సైనికుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన చెన్నై సుందరి త్రిష..