తార‌క్ - త్రివిక్ర‌మ్ సినిమా ఎప్పుడంటే?

  • IndiaGlitz, [Friday,August 23 2019]

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా ఎప్పుడా అనే ఆస‌క్తి అభిమానుల్లో మొద‌లైంది. కొన్ని కాంబినేష‌న్లు ఎప్పుడూ ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అలాంటిదేన‌న్న‌మాట‌.

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, ఇప్పుడున్న యువ హీరోల్లో డైలాగ్‌ని స్ప‌ష్టంగా చెప్ప‌గ‌లిగిన హీరో ఎన్టీఆర్‌.. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో 'అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ‌'లోనే చూశాం.
మ‌ళ్లీ అలాంటి మేజిక్ 2020 ఏప్రిల్‌లో మొద‌లుకానుంది. ఈ సినిమాను కూడా హారిక హాసిని క్రియేష‌న్స్ నిర్మిస్తుంద‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నారు. బ‌ల్గేరియాలో జ‌రిగే షెడ్యూల్‌కి ఎన్టీఆర్ చేరుకుంటారు. ఈ సినిమాను 2020 జూన్‌లో విడుద‌ల చేయాల‌న్న‌ది సంక‌ల్పం. అంటే ఏప్రిల్ నాటికి ఆర్ ఆర్ ఆర్ కి సంబంధించి ఎన్టీఆర్ ప‌నుల‌న్నీ పూర్త‌యిపోతాయి. సో కొత్త లుక్‌కి కూడా చేంజ్ అయ్యే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉంటాయి.

మ‌రోవైపు త్రివిక్ర‌మ్ ఇప్పుడు అల్లు అర్జున్ హీరోగా 'అల వైకుంఠ‌పురంలో' చిత్రాన్ని చిత్రీక‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం షెడ్యూల్ గ్యాప్‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే నెల నుంచి అన్న‌పూర్ణ స్టూడియోలో వేసే భారీ హౌస్ సెట్‌లో జ‌రుగుతుంది. ఎలాగూ ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నారు కాబ‌ట్టి, త్రివిక్ర‌మ్ జ‌న‌వ‌రి ఆఖ‌రుకంతా ఫ్రీ అయిపోతారు.
సో జ‌న‌వ‌రి ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కూ తార‌క్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ చేస్తే స‌రిపోతుంది.

అద‌న్న‌మాట సంగ‌తి... అలా ఏప్రిల్ 2020 నుంచి ఎన్టీఆర్‌-త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంది. అనిరుద్ సంగీతం స‌మ‌కూరుస్తార‌ని టాక్‌. ఈ సినిమా త‌ర్వాత 'కేజీఎఫ్‌' డైర‌క్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. సో... మూడు సినిమాల వ‌ర‌కు ఎన్టీఆర్‌కు ముందుచూపు ఉంద‌న్న‌మాట‌.

More News

తెలుగ‌మ్మాయి త‌ప్పు చేస్తోంది?

జీవితంలో కొన్ని అవ‌కాశాలు అంత తేలిగ్గా రావు. కొంద‌రికి మాత్రం కెరీర్లో చాలా ఎర్లీ స్టేజెస్‌లో వ‌స్తుంటాయి.

ర‌కుల్ నెక్స్ట్ రిలీజ్ ఇదే!

మంచో, చెడో ఏదో ఒక‌టి జ‌రుగుతూ ఉండాలి. నీళ్లు కూడా పారుతూ ఉంటేనే విలువ‌. ఒకే చోట ఉంటే చూడ్డానికి బావుంటుందేమోకానీ, కొన్నాళ్ల‌కు పాచి ప‌ట్టేస్తుంది...

మహేశ్‌తో ఆ డైరెక్టర్‌ సినిమా ఇక లేనట్టేనా..!?

తెలుగు సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో ఒక్క సినిమా అయినా చేయాలని ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తహతహలాడిన విషయం విదితమే.

టీడీపీ నేతలకు భయం పట్టుకుంది..: కొడాలి నాని

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు అంతా అయిపోయింది..

చాయ్‌వాలాగా మారిన దీదీ.. ఎందుకిలా!?

ఇదేంటి చాయ్‌వాలా అంటే టక్కున గుర్తొచ్చేది నరేంద్ర మోదీ కదా..? దీదీ అంటున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..?