ఎన్టీఆర్ 30 నుంచి ఆలియా అవుట్... ఛాన్స్ కోసం ఇద్దరు పాన్ ఇండియా హీరోయిన్స్ పోటీ

  • IndiaGlitz, [Friday,April 29 2022]

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వెయ్యి కోట్ల పైచిలుకు వసూళ్లతో భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ జోష్‌తో వున్న ఎన్టీఆర్ ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా తన తదుపరి సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.

ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాలో నటించనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జనతా గ్యారేజీ ఘన విజయం సాధించింది. ఈ కాంబినేషన్‌ మళ్లీ రీపిట్ అవుతుండటంతో ఇండస్ట్రీలో మంచి అంచనాలు వున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్‌గా చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఆమె ఇటీవల తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని హనీమూన్ మూడ్‌లో వుంది. దీనికి తోడు గతంలో ఒప్పుకున్న పలు ప్రాజెక్టుల వల్ల ఆలియా, ఎన్టీఆర్ 30కి డేట్స్ అడ్జెస్ట్ చేయడం సాధ్యం కాలేదని ఫిలింనగర్ టాక్. దీంతో ఆమె ప్లేస్‌లో మరో హీరోయిన్‌ను వెతకాల్సిన పరిస్ధితి దాపురించింది. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కొరటాల శివ తాను త్వరలో తెరకెక్కించనున్న ఎన్టీఆర్ సినిమా గురించి కొన్ని విషయాలు  పంచుకున్నారు. ఈ మూవీలో మాస్‌తో పాటు ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా వుంటుందని, హీరోయిన్‌కి కూడా బలమైన పాత్ర వుంటుందని కొరటాల శివ చెప్పారు. అయితే అలియా భట్ తప్పుకోవడంతో రష్మిక, పూజా హేగ్డేలు హీరోయిన్ రేసులో ముందున్నారట. ఎన్టీఆర్ పక్కన నటించేందుకు వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. తెలిసిన వారితో లాబీయింగ్ చేస్తున్నారని ఫిలింనగర్ టాక్. పాన్ ఇండియా చిత్రం కావడంతో రష్మిక కెరీర్‌లో ఇది పెద్ద ప్రాజెక్ట్ కానుంది. గత చిత్రాలు రాధేశ్యామ్, బీస్ట్‌లు అట్టర్‌ఫ్లాప్ కావడంతో పూజా హెగ్డేకు అర్జెంట్‌గా హిట్ అవసరం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. NTR30లో రష్మిక ఛాన్స్ కొట్టేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

ఈ సినిమాకు అనిరుధ్ స్వరాలు సమరూర్చనున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నారు. దీని తర్వాత సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నారు ఎన్టీఆర్.

More News

‘‘ఆచార్య’’లో మరో సర్‌ప్రైజ్ : గెస్ట్‌ రోల్‌లో సత్యదేవ్.. ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ చిరు ట్వీట్

కృషి , పట్టుదల, శ్రమించేతత్వం వుంటే ఏ గాడ్ ఫాదర్ లేకపోయినా అత్యున్నత శిఖరాలను

వడ్డీ వ్యాపారం కాదు.. పాలన సంగతి చూడండి : జగన్‌పై నాదెండ్ల మనోహర్ సెటైర్లు

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

BRS పేరుతో కొత్త జాతీయ పార్టీ.. ప్లీనరీలో కేసీఆర్ సంకేతాలు

జాతీయ రాజకీయాల్లో ఎలాగైనా చక్రం తిప్పాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సరైన ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.

ప్రజల దృష్టి మరల్చేందుకే పవన్‌పై విమర్శలు.. టైం చూసి గట్టిగా ఇస్తాం : మంత్రులకు నాగబాబు వార్నింగ్

శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న పోలీస్ వ్యవస్థను వై.సీ.పీ. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు

డాక్టర్లు చికిత్స చేస్తారా, అంబులెన్స్‌లు పంపుతారా.. సర్కార్ వైఫల్యంతోనే ఇలా : రుయా ఘటనపై పవన్ ఆవేదన

తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న ‘‘అంబులెన్స్’’ ఘటనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.