నుమాయిష్‌పై కోవిడ్‌ ఎఫెక్ట్‌.. ఈ ఏడాది కూడా పూర్తిగా రద్దు, నాంపల్లి సొసైటీ కీలక ప్రకటన

  • IndiaGlitz, [Friday,January 07 2022]

దేశంలో కరోనా , ఒమిక్రాన్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో దీని ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది. కేసుల దృష్ట్యా జనం భారీగా గుమిగూడే ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం హైదరాబాద్‌లోని ప్రఖ్యాత నుమాయిష్‌పై పడింది. కోవిడ్ కారణంగా అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ గురువారం ప్రకటించింది.

ఈ నెల 1వ తేదీన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ నుమాయిష్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశం, రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాది నుమాయిష్‌ను రద్దు చేయాలని హైదరాబాద్‌ పోలీసులు ఎగ్జిబిషన్‌ సొసైటీకి నోటీసులు ఇచ్చింది. సీపీ ఆదేశాల మేరకు ఇప్పటికే నుమాయిష్‌లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. అయితే పరిస్ధితి అదుపు తప్పేలా వుండటంతో నుమాయిష్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సొసైటీ ప్రకటించింది. అయితే గతేడాది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్‌ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే.

ప్రతిఏటా జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15.. వరకు 45 రోజుల పాటు సాగుతుంది నుమాయిష్. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను, ఉత్పత్తులను విక్రయిస్తారు. నుమాయిష్‌కు జంట నగరాల నుంచి ప్రతి రోజు 50 వేలమంది వరకు వస్తుంటారు. ఈ క్రమంలో 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శిస్తారు.

More News

మహేశ్‌ బాబుకి కరోనా పాజిటివ్.. ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలుకోవాలంటూ ఫ్యాన్స్ ట్వీట్లు

దేశంలో పరిస్థితులు మళ్లీ అదుపు తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా కరోనా, ఒమిక్రాన్ కేసులు ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి.

కోలీవుడ్‌లో కరోనా కలకలం.. హీరో అరుణ్ విజయ్‌కు పాజిటివ్, ఆందోళనలో ఫ్యాన్స్

దేశంలో కరోనా కేసులు మరోసారి ఊహకందని వేగంతో పెరుగుతున్నాయి. గురువారం ఒక్కసారిగా 90 వేల కొత్త కేసులు నమోదవ్వగా..

చట్టానికి సహకరిస్తా.. నా కొడుకును దూరం పెడతా: ప్రజలకు ఎమ్మెల్యే వనమా బహిరంగ లేఖ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ అనే వ్యక్తి భార్య, ఇద్దరు ఆడపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే.

ఐదు భాషల్లో  21న "వర్మ'' (వీడు తేడా) ఆగమనం

నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం "వర్మ'' (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ ,సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు.

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య.. ఎట్టకేలకు వనమా రాఘవ అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారం తెలుగు నాట సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.