సెల్‌ఫోన్ తీశాడనే నెపంతో యువకుడికి శిరోముండనం చేయించిన నూతన్ నాయుడు

  • IndiaGlitz, [Saturday,August 29 2020]

సినీ నిర్మాత నూతన్‌కుమార్ నాయుడు తనకు శిరోముండనం చేయించారంటూ ఓ యువకుడు వీడియో విడుదల చేసి కలకలం సృష్టించాడు. విశాఖ నగర పరిధిలోని సుజాతానగర్‌లో ఉన్న సినీ నిర్మాత నూతన్‌కుమార్‌నాయుడు ఇంట్లో శుక్రవారం కర్రి శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించారు . బాధితుడు కర్రి శ్రీకాంత్‌(20) ఈ విషయాన్ని ఓ వీడియో సందేశం ద్వారా వెల్లడించాడు. తనను దారుణంగా కొట్టారని పేర్కొన్నాడు.

‘నేను నూతన్ నాయుడు సర్ ఇంట్లో 4 నెలలపాటు పని చేశాను. ఆగస్ట్ 1న జీతం తీసుకుని మానేశా. నిన్న రాత్రి ఫోన్ చేసి రమ్మన్నారు. వెళ్తే ఫోన్ పోయిందన్నారు. నువ్వే ఫోన్ తీసుకున్నావని నింద మోపారు. మళ్లీ సూపర్‌వైజర్ ఫోన్ చేస్తే వెళ్లాను. ఫోన్ నువ్వే తీశావని గట్టిగా ప్రశ్నించారు. నేను తీయలేదు.. తీయనప్పుడు ఎక్కడి నుంచి తీసుకురానని అడిగాను. వాళ్లు నాపై రివర్స్ అయిపోయి కొట్టారు. మా వాట్సాప్ హ్యాక్ చేశావని.. సైబర్ క్రైంలో కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు. బ్యూటీషియన్ ఇందిరను తీసుకొచ్చారు. సెల్‌ఫోన్‌ హ్యాక్‌ చేసి అసభ్యంగా ప్రవర్తించావంటూ నన్ను కొట్టారు. తర్వాత మంగళోడి దగ్గరకు తీసుకెళ్లి గుండు కొట్టించారు. ఎంత వద్దని కాళ్లు పట్టుకున్నా వదలకుండా రక్తం వచ్చేలా కొట్టారు’’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.

ఘటన జరిగిన సమయంలో నూతన్‌ భార్య అక్కడే ఉన్నారని బాధితుడు తెలిపాడు. శిరోముండనం ఘటనపై శ్రీకాంత్‌ పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, నూతన్‌కుమార్‌ 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ తరఫున పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. బిగ్‌బాస్‌ షోలో పాల్గొన్నారు. ప్రస్తుతం సినీ, రాజకీయ రంగాల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ‘పరాన్నజీవి’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

More News

ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. నేడు మరోసారి 10 వేలకు పైగా కేసులు

ఏపీలో కరోనా మరోమారు విజృంభిస్తోంది. కొద్ది రోజుల క్రితం వరుసగా 10 వేలు నమోదైన కేసులు మధ్యలో కాస్త తగ్గాయి.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వైద్యుల మాటలకు స్పందిస్తున్నారు: ఎంజీఎం

ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. కొద్ది రోజుల పాటు బాగానే ఉన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించిందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

‘వ‌కీల్ సాబ్‌’ బ‌ర్త్ డే ట్రీట్ అదేనా..?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సెప్టెంబ‌ర్ 2.

ఆదా శర్మ కొత్త సినిమా 'క్వశ్చన్ మార్క్ (?)'

శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా విప్రా దర్శకత్వం లో  గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘనా సమర్పణలో

‘ఆదిపురుష్’ గురించి ప్ర‌భాస్ ప్లాన్‌..!!

ప్యాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస‌గా క్రేజీ ప్రాజెక్టుల‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ ఓంరావుత్ ద‌ర్శ‌క‌త్వంలో