Sai Kiran : సభ్యత్వం పేరిట రూ.లక్షలు మోసం .. నిర్మాతపై ఫిర్యాదు చేసిన నువ్వేకావాలి సాయికిరణ్

  • IndiaGlitz, [Sunday,June 26 2022]

నువ్వేకావాలి సినిమాలో తరుణ్, రిచాలతో పాటు సమానంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సింగర్ సాయి కిరణ్‌ను ఇద్దరు వ్యక్తులు మోసం చేశారు. మన్న మినిస్ట్రీస్‌లో సభ్యత్వం పేరుతో రూ.10.6 లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ నిర్మాత జాన్ బాబు, లివింగ్‌స్టెన్‌లపై సాయికిరణ్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జాన్ బాబు, లివింగ్ స్టెన్‌లపై 420, 406 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు.

సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి:

సంగీత విద్వాంసుల కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన సాయి కిరణ్.. లెజెండరీ సింగర్ పి. సుశీల మనువడు. ఆయన తల్లిదండ్రులు కూడా సంగీతంలో విధ్వాంసులే. అయితే సింగర్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి నటుడు అయ్యారు సాయి కిరణ్.

సినిమాల్లో రాని గుర్తింపు సీరియల్స్‌తో:

ఇకపోతే.. సాయి కిరణ్ దాదాపు పాతికకు పైగా సినిమాల్లో నటించారు. నువ్వే కావాలి, ప్రేమించు, దేవి, మనసుంటే చాలు వంటి చిత్రాలతో మెప్పించిన సాయి కిరణ్ ప్రస్తుతం సీరియల్స్‌లో బిజీగా ఉన్నారు. కోయిలమ్మ సీరియల్‌తో పాపులర్ అయిన సాయి కిరణ్.. ప్రస్తుతం ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో హీరోకి తండ్రిగా తెలుగు వారిని అలరిస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళంలోనూ వరుస సీరియల్స్ చేస్తూ బిజీగా మారిపోయారు. వాస్తవానికి సినిమాల ద్వారా లభించని గుర్తింపు సీరియల్స్‌తో సంపాదించుకున్నాడు సాయి కిరణ్.

More News

Janasena : భావి తరాలను కాపాడుకోవాలంటే జనసేన రావాల్సిందే .. నేనూ కార్యకర్తలా శ్రమిస్తా: నాగబాబు

వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేనను పటిష్ట పరిచే పనుల్లో బిజీగా వుంటున్నారు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు.

ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్  "ఏనుగు" కు క్లీన్ U/A

శ్రీమతి జగన్మోహని సమర్పణలో  విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్,  డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై

Kommu Konam Fish: వలలో చిక్కిన అరుదైన చేపలు.. కోటీశ్వరులైన ఇద్దరు జాలర్లు

కొంతమందికి రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వస్తుంది. కొందరు జాలర్ల విషయంలో ఈ విషయం ఎన్నో సార్లు రుజువైంది.

Janasena : సమీక్షా సమావేశాలతో పవన్ బిజిబిజీ.. ఏపీ, తెలంగాణ నేతలతో వరుస భేటీలు, ఎన్నికలపై దిశానిర్దేశం

ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం వుండటంతో జనసేన అధినేత పపన్ కల్యాణ్ యాక్టీవ్ అయ్యారు.

Janasena : జనసేన మహిళా నేతకు అర్థరాత్రి పూట ఫోన్లు, బాలినేని గారూ.. ఇది కరెక్ట్ కాదు : పవన్ ఆగ్రహం

తమ పార్టీ అధికార ప్రతినిధి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు.