'నువ్వు తోపురా' ఫస్ట్ లుక్ విడుదల

  • IndiaGlitz, [Friday,June 02 2017]

"లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" ఫేమ్ సుధాకర్ కొంత విరామం అనంతరం మళ్లీ వెండితెరపై కనువిందు చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. హరనాథ్ బాబు.బి దర్శకత్వంలో యునైటెడ్ ఫిలిమ్స్ పతాకంపై డి.శ్రీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్స్ గత కొన్ని రోజులుగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నాయి. సుధాకర్ కోమాకుల ఓ వైవిధ్యమైన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి "నువ్వు తోపురా" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.సుధాకర్ కోమాకుల సరసన నిత్యా శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను నేడు (జూన్ 2) విడుదల చేసారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీకాంత్ మాట్లాడుతూ.. "సుధాకర్ కోమాకుల-నిత్యాశెట్టిలు జంటగా రూపొందుతున్న "నువ్వు తోపురా" చిత్రీకరణ 70% అమెరికాలో షూట్ చేసేందుకు ప్లాం చేస్తున్నాం. 30% ఇండియాలో షూట్ చేస్తాం. మొదటి షెడ్యూల్ మే 23న మొదలయింది. తర్వాతి షెడ్యుల్ అమెరికాలో ప్రారంభంకానుంది. హాలీవుడ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న "నువ్వు తోపురా" టీజర్ ను జూన్ 9న విడుదల చేయనున్నాం. అత్యుత్తమ సాంకేతిక నిపుణులతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మా దర్శకుడు హరినాధ్ బాబు.బి తెరకెక్కిస్తున్నారు. కృష్ణవంశీ-వైవిఎస్ చౌదరిల వద్ద శిష్యరికం చేసిన ఆయన ఈ చిత్రాన్ని అద్భుతంగా రూపొందిస్తాడన్న నమ్మకం ఉంది" అన్నారు.

More News

ఐదు గంటల్లోనే రెండు మిలియన్ వ్యూస్ రాబట్టుకున్న'స్పైడర్'

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.

జూన్ 3న కేటీయార్-రామ్ చరణ్ లు విడుదల చేయనున్న 'కాదలి' ఆడియో

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న "కాదలి" ఇప్పటికే రానా, సమంత వంటి స్టార్ లు ప్రమోట్ చేయడం వల్ల విశేషమైన క్రేజ్ ను సంపాదించుకొంది.

చైతు స్థానంలో సందీప్ కిషన్...

రీసెంట్గా నగరం(తమిళంలో మా నగరం) సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా మారుతున్నాడు.

రానా కూడా వారిలాగానే...

ఇప్పుడు వెండితెరకు ఎంత ప్రాధాన్యత ఉందో బుల్లి తెరకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అందుకే చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్ హీరోలు బుల్లితెరపై వ్యాఖ్యాతలుగా సందడి చేస్తున్నారు.

రేసుగుర్రం బ్యూటీతో బాలయ్య...

హీరోయిజాన్ని డిపరెంట్గా తెరకెక్కించే డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ 101వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియాశరన్, ముస్కాన్లు హీరోయిన్స్గా నటిస్తున్నారు.