'ఓ మల్లి' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • IndiaGlitz, [Saturday,March 05 2016]

ఆర్.ఎ. ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో బి.ప్రశాంత్ నిర్మాతగా రమ్యశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం 'ఓ మల్లి'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా ..
రమ్య శ్రీ మాట్లాడుతూ.. ''కథ మీదున్న ఇష్టంతో రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసం ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఈరోజుల్లో సినిమా అంటే నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, రెండు రొమాంటిక్ సీన్స్. కాని మా సినిమా అలా ఉండదు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకొని చాలా న్యాచురల్ గా సినిమా చేశాం. మార్చి 18న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
ఈ సమాజంలో రిలేషన్స్ అనేవి మాయమైపోతున్నాయి. బంధాలకు పెద్ద పీట వేస్తూ ఈ సినిమా ఉంటుంది. ఓ అమాయకురాలి జీవితాన్నే సినిమాగా చేశాను. ట్రైబల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ప్రేమ, భార్య భర్తల అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి సినిమా ఇప్పటివరకు తెలుగు ఇండస్ట్రీలో రాలేదు. సెన్సార్ సమస్యలేమీ ఎదుర్కోలేదు కాని థియేటర్ల సమస్య మాత్రం బాగా ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా తరువాత మరో మూడు ప్రాజెక్ట్స్ లో నటించనున్నాను'' అని చెప్పారు.

More News

నా రెమ్యునరేషన్ నిర్మాతలే పెంచుతున్నారు - శర్వానంద్

‘వెన్నెల’, ‘గమ్యం’, ‘ప్రస్థానం’,‘రన్ రాజా రన్’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్న హీరో శర్వానంద్ పుట్టినరోజు మార్చి 6. ఈ సందర్భంగా పాత్రికేయులతో శర్వానంద్ మాట్లాడుతూ

మణిరత్నం, రాజమౌళి, త్రివిక్రమ్ కంటే ముందు ఆయనే అంటున్నశర్వా...

యువ హీరో శర్వానంద్ రన్ రాజా రన్,మళ్లీ మళ్లీ ఇదిరాని రోజు,ఎక్స్ ప్రెస్ రాజా...చిత్రాలతో హ్యాట్రిక్ సాధించి రాజాధిరాజాగా

కంట్రోల్ త‌ప్పుతున్న బాల‌య్య‌..

బాల‌కృష్ణ ఈమ‌ధ్య మీడియా ముందు మాట్లాడుతున్నాం అనే విష‌యాన్నిమ‌ర‌చిపోయి త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా మాట్లాడి వార్త‌ల్లో నిలుస్తున్నారు.

బాల‌య్య డైరెక్ట‌ర్ తో ప‌వ‌న్ సినిమా

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య డైరెక్ట‌ర్ తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా చేయ‌నున్నాడ‌నే వార్త హాట్ టాపిక్ అయ్యింది.

సర్ధార్...కోసం శ్రేయా ఘోషల్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.