మే 13న నైజాంలో విడుదల కానున్న ఓ మల్లి

  • IndiaGlitz, [Tuesday,May 10 2016]

బి.రమ్యశ్రీ ప్రధాన పాత్రధారిణిగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఓ మల్లి'. ఆర్‌.ఎ.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై బి.ప్రశాంత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 13న నైజాంలో విడుదలవుతుంది.

బి.రమ్యశ్రీ మాట్లాడుతూ 'ఓ గ్రామంలోని యువతి జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమా బాగా రావడం కోసం రెండు సంవత్సరాలు పాటు యూనిట్‌ సభ్యులంతా శ్రమించారు. ఇటీవల నైజాం మినహా మిగతా ప్రాంతాల్లో విడుదలైన ఈ చిత్రం ఆడియెన్స్ నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా మంచి స్పందనను రాబట్టుకుంది. ఓ మంచి సినిమా తీశామన్న సంతృప్తి కలిగింది. సునీల్‌ కశ్యప్‌ సంగీతమందించిన పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కె.దత్తు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మే 13న సినిమాను నైజాంలో విడుదల చేస్తున్నాం. ఇక్కడి ప్రేక్షకులు కూడా మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాం'' అన్నారు.

ఆకాష్‌, ఎల్బీ శ్రీరామ్‌, శ్రీధర్‌, వేణు, సాయి, జయవాణి, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎడిటర్‌: వి.నాగిరెడ్డి, సంగీతం: సునీల్‌ కశ్యప్‌.

More News

మొరాకోలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' సందడి

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు.

టాప్ 5 గ్రాస‌ర్ గా స‌రైనోడు చిత్రాన్ని నిల‌బెట్టిన ఫ్యామిలి ఆడియ‌న్స్ మా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు : చిత్ర యూనిట్ స‌భ్యులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ,  ప్రతిష్టాత్మక నిర్మాణ‌సంస్థ‌ గీతా ఆర్ట్స్ కాంబినేష‌న్ లో ఎస్ ప్రోడ్యూస‌ర్‌ అల్లు అరవింద్ నిర్మాణంలో వ‌చ్చిన స‌రైనోడు చిత్రానికి యూత్‌, మాస్ ఆడియ‌న్స్ తో పాటు ప్ర‌త్యేఖంగా ఫ్యామలి ఆడియ‌న్స్ అంద‌రూ అత్య‌ద్బుత‌మైన రెస్పాన్స్ తో క‌లెక్ష‌న్ల‌ రికార్డుల‌Ķ

త్రిష ఇక వాటికే ప‌రిమిత‌మా?

'వ‌ర్షం', 'నువ్వొస్తానంటే నేనొద్దాంటానా', 'అత‌డు', 'ఆకాశ‌మంత‌'.. ఇలా కొన్ని చిత్రాల్లో ది బెస్ట్ అన‌ద‌గ్గ యాక్టింగ్ స్కిల్స్‌ని ప్ర‌ద‌ర్శించింది త్రిష‌. ఆ త‌రువాత ఆమెకి ఆ రేంజ్ పాత్ర‌లైతే దొర‌క‌లేద‌నే చెప్పాలి.

'రైట్ రైట్' మేకింగ్ వీడియో విడుద‌ల‌

తెలుగు ప‌రిశ్ర‌మ‌లో వ‌రుస ఘ‌న విజ‌యాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని ఏర్ప‌ర‌చుకున్న స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎం.ఎస్‌.రాజు చేతుల మీదుగా క్యూట్ హీరో సుమంత్ అశ్విన్ న‌టించిన `రైట్ రైట్‌` మేకింగ్ వీడియో విడుద‌లైంది.

నిత్యా మరోసారి నిరూపించింది

'అలా మొదలైంది' నుంచి కథానాయిక నిత్యా మీనన్ ది ఒకటే శైలి. తనకిచ్చిన పాత్రకి న్యాయం చేయడం. అదే సిద్ధాంతాన్ని ఇటీవల విడుదలైన'24' వరకు కొనసాగిస్తూనే వచ్చింది. ఆ చిత్రంలో సూర్య పక్కన నటించినా ఒక్క పాట కూడా ఆమెకు లేదు.