మార్చి 17న 'ఓ పిల్లా నీ వల్లా'

  • IndiaGlitz, [Sunday,March 05 2017]

కిషోర్ స్వీయ‌ద‌ర్శ‌క‌త్వంలో బిగ్ విగ్ మూవీ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ‌ నిర్మిస్తున్న‌ చిత్రం 'ఓ పిల్లా నీ వ‌ల్లా'. కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా న‌టీన‌టులు. ఇటీవ‌లే రిలీజ్ చేసిన‌ ఆడియోకి శ్రోత‌ల నుంచి చ‌క్క‌ని స్ప ంద‌న వ‌చ్చింది. ప‌లువురు సినీప్ర‌ముఖులు ఆడియో బావుంద‌ని ప్ర‌శంసించారు. ద‌ర్శ‌క‌నిర్మాత కిషోర్ ఓ అభిరుచి గ‌ల చిత్రాన్ని తెర‌కెక్కించార‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించిన‌ మోష‌న్ పోస్ట‌ర్‌కి, మెస్మ‌రైజింగ్ స్టార్ శ‌ర్వానంద్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌హా ప్రేక్ష‌కాభిమానుల నుంచి, ప‌రిశ్ర‌మ నుంచి చ‌క్క‌ని ప్ర‌శంస‌లు ద‌క్కాయి. పోస్ట‌ర్లు, ట్రైలర్‌ ఆస‌క్తి రేకెత్తించింద‌ని అన్నివ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లొచ్చాయి. మార్చి 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు.
ఈ సంద‌ర్భంగా.........
చిత్ర ద‌ర్శ‌క నిర్మాత కిషోర్ మాట్లాడుతూ - ''ఓ పిల్లా నీ వ‌ల్లా.. చ‌క్క‌ని వినోదాత్మ‌క చిత్రం. ల‌వ్‌, కామెడీ -యాక్ష‌న్ హైలైట్‌గా ఉంటాయి. అన్ని వ‌ర్గాల్ని మెప్పించే చిత్ర‌మిది. పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌కి చ‌క్క‌ని స్ప ంద‌న వ‌చ్చింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఆడియో శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మార్చి 17న రిలీజ్ చేస్తున్నాం. మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ అనే తేడా లేకుండా అంద‌రినీ ఆక‌ట్టుకునే చిత్ర‌మిది'' అన్నారు.
కృష్ణ‌చైత‌న్య‌, రాజేష్ రాథోడ్‌, మోనికా సింగ్, షాలు చారసియా, సూర్య శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సాహిత్యంః కృష్ణ మ‌దినేని, క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌, కోరియేగ్రాఫర్ :జీతెంద్ర యాక్ష‌న్ః మార్ష‌ల్ ర‌మ‌ణ‌, సినిమాటోగ్ర‌ఫీః షోయబ్ అహ్మ‌ద్ కె.ఎం., ఎడిట‌ర్ః అనిల్ కింతాడ సహా నిర్మాత : మౌర్యా సంగీతంః మ‌ధు పొన్నాస్‌, నిర్మాతః కిషోర్‌, క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః కిషోర్‌.

More News

చరణ్ , సుకుమార్ రెగ్యలర్ షూటింగ్....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న చిత్రం

మార్చి 17న 'నేనోరకం'

సాయిరామ్ శంకర్ హీరోగా శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం నేనోరకం.చిత్రీకరణ పూర్తి చేసుకొంది.సుదర్శన్ సలేంద్ర దర్శకత్వంలో

నారా రోహిత్ హీరోగా ఎస్.వి.ఎం.పి ప్రొడక్షన్ నెం.1 ప్రారంభం!

వెర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ హీరోగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతునున్న చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 5)జరిగింది.

చిరంజీవి నెక్ట్స్ మూవీ ముహుర్తం ఫిక్స్...

'ఖైదీ నంబర్ 150' చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి గ్రాండ్ వెల్కమ్ దొరికింది.

అమ్మాయిలకు ప్రభాస్ కూడా..

ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకడు.