మే 26 న 'ఓ పిల్లా నీ వల్ల'

  • IndiaGlitz, [Friday,May 19 2017]

బిగ్ విగ్ బ్యానర్ లో కృష్ణ చైతన్య, రాజేష్ రాథోడ్, షాలు, మౌనిక జంటలుగా కిశోర్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం ఓ పిల్లా నీ వల్ల. ఈ చిత్ర విడుదల తేదీని దర్శక నిర్మాత ఎన్ శంకర్ చే ప్రకటించారు ఓ పిల్లా నీ వల్ల యూనిట్. ఈ సందర్బంగా అతిథి ఎన్ శంకర్ మాట్లాడుతూ బిగ్ వింగ్ బ్యానర్ లో కిశోర్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. కిశోర్ లండన్ లో చదువుకున్నా సినిమా పై ఉన్న ప్యాషన్ తో తన స్నేహితుడు మౌర్య సహకారం తో ఈ సినిమా చేసాడు.
సినిమా చూసానేను యంగ్ బ్లడ్ ఉరక లేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, యూత్ ను ఆకట్టుకునే సన్నివేశాలు , ఇక మ్యూజిక్ అయితే అందర్నీ ఆకట్టుకుంటుంది. చాలా బాగోచ్చింది చిత్రం మే 26 న తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో థియేటర్లు కూడా బుక్ అయ్యాయి. అందరూ సినిమాను చూసి టీం ను మరిన్ని మంచి సినిమాలు చేసేలా ప్రోత్సహించాలని కోరుతున్నా అన్నారు. ఈచిత్ర దర్శకుడు, నిర్మాత కిషోర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని తీయడానికి చాలా కష్టపడ్డాము. ఇవన్నీ దాటి విడుదల చేసే వరకు వచ్చాము. నా స్నేహితుడు మౌర్య సహకారం తోనే ఈ సినిమా నిర్మించడం జరిగింది.
ఈ సందర్బంగా అతనికి నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా, రెండు ప్రేమ జంటల మధ్య అనుకోని సంఘటనలు ఎదురైతే ఎలా ఉంటుందో తెలిపే కథాశం. మ్యూజిక్ ఈ సినిమా కు హైలెట్ అని చెప్పొచ్చు. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. రెండు ప్రేమ జంటల కథ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కిశోర్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది కనుక అందరికీ నచ్చుతుందని హీరో కృష్ణ చైతన్య తెలిపారు.
కొరియోగ్రాఫర్ జిత్తు మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి సింగల్ కార్డ్ అవకాశాన్ని ఇచ్చిన కిశోర్ గారికి నా కృతజ్ఞత లని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సుదర్శన్, అశోక్, రాజేష్ రాథోడ్, సూర్య శ్రీనివాస్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

More News

'పి.ఎస్.వి.గరుడవేగ 126.18M'లో 'జార్జ్'గా కిషోర్

యాంగ్రీ యంగ్ మేన్గా వెండితెరపై ప్రేక్షకులను మెప్పించిన డా.రాజశేఖర్ టఫ్ పోలీస్ ఆఫీసర్గా జ్యోస్టార్ ఎంటర్ ప్రైజెస్ సమర్పణలో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం``పి.ఎస్.వి.గరుడవేగ 126.18M``.

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో ఘనంగా జరిగిన సెయింట్ డాక్టర్ MSG'జట్టు ఇంజనీర్' ప్రియమిర్ షో.

యం యస్ జి, యం యస్ జి 2, లయన్ హార్ట్, నాపాక్ కో జవాబ్, వంటి యాక్షన్ విత్ మెసేజ్ తో వచ్చిన నాలుగు చిత్రాల తరువాత అయిదో మూవీ'జట్టు ఇంజనీర్' మే 19న బాలీవుడ్ లో విడుదల కాబోతున్న సందర్భంగా ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ చిత్రం ప్రియమిర్ షో ప్రదర్శించారు.

దిలీప్ , రెజీన జంటగా 'హరే రామ హరే కృష్ణ' చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

సాయి అరుణాచలేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిలీప్ ప్రకాష్,రెజీనా హీరో హీరోయిన్లుగా

ద్విభాషా చిత్రంలో నాగశౌర్య

మద్రాసు పట్టణం,అభినేత్రి చిత్రాల దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ఇప్పుడు మరో ద్విభాషా చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో రానా...

బాహుబలి,ఘాజీ,నేనే రాజు నేనే మంత్రి వంటి డిఫరెంట్ మూవీస్ చేస్తున్న దగ్గుబాటి రానా