షూటింగ్ పూర్తి చేసుకోనున్న 'ఒక్కడు మిగిలాడు'

  • IndiaGlitz, [Saturday,April 29 2017]

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషిస్తున్న తాజా చిత్రం "ఒక్కడు మిగిలాడు". అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ రేపటితో పూర్తవుతుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా.. అలియాస్ జానకి ఫేమ్ అనీషా ఆంబ్రోస్ ఓ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. అనీషా ఈ చిత్రంలో జర్నలిస్ట్ గా నటిస్తోంది.

అనీషా ఆంబ్రోస్ పాత్ర గురించి దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి మాట్లాడుతూ.. "అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో ఓ జర్నలిస్ట్ గా మంచి పాత్ర పోషిస్తోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం. ఒక నటిగా అనీషాకు మంచి పేరు తెచ్చిపెడుతుందీ చిత్రం" అన్నారు.

చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "ఇటీవల విడుదలైన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన లభిస్తోంది. త్వరలోనే మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్ ను కూడా విడుదల చేయనున్నాం. రేపటితో హైద్రాబాద్ లో గత కొన్ని రోజులుగా షూట్ చేస్తున్న లాస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. త్వరలోనే ట్రైలర్ మరియు ఆడియో విడుదల తేదీలను వెల్లడిస్తాం" అన్నారు.

మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి!

More News

రూమర్స్ పై తమన్నా క్లారిటీ...

మిల్కిబ్యూటీ తమన్నా బాహుబలి చిత్రంలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

మహేష్ అభినందనల పై కామెంట్స్...

సూపర్ స్టార్ మహేష్ కళాతపస్వి కె.విశ్వనాథ్ కు వచ్చిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సందర్భంగా

భూటాన్ లో జక్కన్న...

ఐదేళ్ళ ప్రయాణం ఏప్రిల్ 28న 'బాహుబలి 2' విడుదలతో పూర్తయ్యింది.సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుంది.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రక్షకభటుడు'

సుఖీభవ మూవీస్ పతాకంపై ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.గురురాజ్ నిర్మాత గా రూపొందుతోన్న

మే 19న 'కేశవ' గ్రాండ్ రిలీజ్

హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ హీరో నిఖిల్.'ఎక్కడికి పోతావు చిన్నవాడా',