ఒక్కడు మిగిలాడు రిలీజ్ వాయిదా

  • IndiaGlitz, [Tuesday,September 05 2017]

మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకుడు. నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు ఎక్కువగా ఉన్నందున కొంత మేరకు జాప్యం జరుగుతున్నట్టు నిర్మాతలు ఎస్ ఎన్ రెడ్డి, ఎన్ లక్ష్మీకాంత్ తెలిపారు. 25 నిమిషాల పాటు జరిగే యుద్ధ సన్నివేశాలతో పాటు 35 నిమిషాలు సముద్రంలో సాగే ప్రయాణం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు.

వీటిని దర్శకుడు అజయ్ అధ్బుతంగా చిత్రీకరించారని తెలిపారు. చిత్రం విడుదల తేదీని వారం రోజుల్లో ప్రకటిస్తామన్నారు. మనోజ్ నటన ఇది వరకు ఎప్పుడు చూడని విధంగా చాలా అద్భుతంగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రం లో మనోజ్ సరసన అనీషా అంబ్రోస్ నటించగా అజయ్, జెన్నిఫర్, మురళీమోహన్, సుహాసిని, బెనర్జీ, మిలింద్ గునాజి ఇతర నటీనటులు. ఈ చిత్రానికి శివ నందిగాం సంగీతం అందించగా వి కే రామరాజు సినిమాటోగ్రఫీ, పి ఎస్ వర్మ ఆర్ట్.

More News

నటకిరీటి రాజేంద్రప్రసాద్ నటనకి 40 ఏళ్లు..

హాస్య కథానాయకుడికి స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్.

సెప్టెంబర్ 7న 'మహనుభావుడు' టైటిల్ సాంగ్ సింగిల్ విడుదల

శర్వానంద్ హీరోగా,మెహ్రీన్ హీరోయిన్ గా,మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియోషన్స్

క‌థానాయకుడిగా 9 ఏళ్లు పూర్తిచేసుకున్న నాని

కొంద‌రి న‌ట‌న చూస్తే వారేదో న‌టిస్తున్న‌ట్లు అనిపించ‌దు. మ‌న ప‌క్కింటి అబ్బాయినో, అమ్మాయినో తెరపై చూస్తున్నామ‌నిపిస్తుంది. అలాంటి ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌ల్లో ఇట్టే ఒదిగిపోయి.. స‌హ‌జ‌న‌టుడుగా పేరు తెచ్చుకున్నాడు నాని.

వందేమాతరం శ్రీనివాస్ కు 'కాళోజి' పురస్కారం

ప్రజా కవి,పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా

ఆస్కార్ అవార్డుల దేశీయ కమెటీ ఛైర్మెన్ గా ఎన్నికైన సివిరెడ్డి

ప్రపంచ సినిమాలో మేటి అయిన ఆస్కార్ అవార్డు కమెటీకి భారత దేశపు సినిమాను ఎంపిక చేసే కమెటీకి ఛైర్మెన్ గా ప్రముఖ దర్శకుడు నిర్మాత సివిరెడ్డి ఎంపిక అయ్యారు..