సెన్సార్ పూర్తి చేసుకున్న నాగ్ మూవీ...

  • IndiaGlitz, [Wednesday,February 01 2017]

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయస‌. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి కావ‌డంతో సినిమా విడుద‌ల ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ రిలీజ్ కావ‌డానికి అన్నీ మార్గాలు సుగుమ‌మైన‌ట్లే.

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి చిత్రాలు ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. యం.యం.కీరవాణి సంగీతంలో రూపొందిన ఈ చిత్రాల్లోని పాటలు సంచలన విజయం సాధించాయి. అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.

More News

బ్యాంకాక్ పై కన్నేసిన రకుల్....

స్టార్ హీరోయిన్ గా తెలుగులో పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా ఎఫ్ 45జిమ్ ను స్టార్ట్ చేసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టింది.

హైదరాబాద్ లో సూర్య...

సూర్య సినిమా ఇప్పుడు హైదరాబాద్ లో చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఎమీజాక్సన్ ఇలా చేసుకోవడం మూడోసారి....

జనవరి 31న పుట్టిన రోజును జరుపుకున్న హీరోయిన్ ఎమీజాక్సన్...

మొదలైన మోహనకృష్ణ ఇంద్రగంటి మల్టీసారర్ మూవీ!

అర్ధవంతమైన చిత్రాలకు పెట్టింది పేరు మోహనకృష్ణ ఇంద్రగంటి. "జెంటిల్ మెన్" లాంటి సూపర్ హిట్ అనంతరం అడివి శేష్-అవసరాల శ్రీనివాస్ లు హీరోలుగా "ఎ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్" పతాకంపై ఓ మల్టీ స్టారర్ ను తెరకెక్కించనున్నారు.

ఆ హీరోయిన్స్ మరోసారి కలిసి నటిస్తున్నారు..

గతంలో తెలుగులో బృందావనం, బ్రహ్మోత్సవం సినిమాల్లో కలిసి నటించారు. ఇప్పుడు మూడోసారి ఈ హీరోయిన్స్ కలిసి నటించనున్నారట.