మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత‌..

  • IndiaGlitz, [Tuesday,November 07 2017]

2013లో మూడు చిత్రాల‌తో సంద‌డి చేశారు సీనియ‌ర్ క‌థానాయ‌కుడు వెంక‌టేష్‌. వాటిలో రెండు చిత్రాలు మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు (సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌సాలా) కాగా.. మ‌రొక‌టి సోలో హీరో మూవీ (షాడో). ఆ త‌రువాత మాత్రం ఏడాదికో సినిమా అన్న‌ట్లుగా వెంకీ సినిమాలు వ‌చ్చాయి. అయితే.. మ‌ళ్లీ ఐదేళ్ల త‌రువాత వెంకీ క‌థానాయ‌కుడిగా మూడు చిత్రాలు వ‌చ్చే అవ‌కాశ‌ముంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. విశేష‌మేమిటంటే.. వీటిలో కూడా రెండు మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు ఉండొచ్చ‌ని తెలిసింది.

కాస్త వివ‌రాల్లోకి వెళితే.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో త‌న త‌దుప‌రి చిత్రాన్ని చేయ‌నున్న వెంక‌టేష్‌.. ఆ సినిమాతో పాటు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం.. క‌ళ్యాణ్ కృష్ణ డైరెక్ష‌న్‌లో ఇంకో మూవీ చేయ‌నున్నాడు. ఈ రెండు కూడా మ‌ల్టీస్టార‌ర్ మూవీలే కావ‌డం విశేషం. అనిల్ రావిపూడి చిత్రంలో మ‌రో హీరో ఎవ‌రో క‌న్‌ఫ‌ర్మ్ కాలేదు.. కానీ టైటిల్ మాత్రం ఎఫ్ 2 (ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్‌) అని వినిపిస్తోంది.

ఇక క‌ళ్యాణ్ కృష్ణ చిత్రంలో వెంకీతో పాటు నాగ‌చైత‌న్య కూడా న‌టించ‌నున్నాడు. మేన‌మామ‌, మేన‌ల్లుడు అనుబంధం నేప‌థ్యంలో ఈ సినిమా ఉంటుంది. మొత్తానికి 2013 త‌రువాత 2018లో వెంకీ ముచ్చ‌ట‌గా మూడు సినిమాల‌తో సంద‌డి చేయ‌నుండ‌డం ఆయ‌న అభిమానుల‌కు ఆనందాన్నిచ్చే విష‌య‌మే.

More News

ఎన్టీఆర్ సింగ‌ర్‌.. రెండు సినిమాలు

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన రాఖీ సినిమాలోని జ‌ర‌జ‌ర పాకే విషంలా.. అంటూ సాగే పాట ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

హెబ్బాకి ఆ సెంటిమెంట్ క‌లిసి రాలేదు

త‌క్కువ కాలంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఈ త‌రం క‌థానాయిక‌ల్లో హెబ్బా ప‌టేల్ ఒక‌రు. అలా ఎలా అనే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ మ‌ద్దుగుమ్మ‌.. కుమారి 21 ఎఫ్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది.

నవంబర్ 9న సువర్ణ సుందరి టీజర్

గత కొంత కాలంగా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల నిర్మాణం సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలొ కాస్త ఎక్కువగానే కన్పిస్తొంది. స్టార్ హీరో హీరోయిన్ లు కూడా రోటీన్ కి భిన్నంగా, తమ క్యారక్టరైజేషన్ కంటే  కధ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

మ‌ల‌యాళంలోకి వ‌రుణ్‌తేజ్‌...

మెగా క్యాంప్ హీరోల‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేర‌ళ‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్‌చ‌ర‌ణ్‌, అల్లుఅర్జున్ సినిమాలు మ‌ల‌యాళంలోని అనువాద‌మై విడుద‌ల‌వుతుంటాయి.

కేసు క్లియ‌ర్‌..24న జూలీ వ‌చ్చేస్తుంది..

రాయ్ ల‌క్ష్మీ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం 'జూలీ 2'. ఈ సినిమాను దీపిక్ శివ్‌స‌దాని తెర‌కెక్కించడంతో పాటు స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. దీప‌క్‌నాయ‌ర్‌, ప‌హ‌ల‌జ్ నిహ్‌లానీ నిర్మాత‌లు.