రవితేజకు జోడిగా మరోసారి

  • IndiaGlitz, [Wednesday,August 14 2019]

మాస్ మహారాజా రవితేజ హీరోగా 'RX100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ చిత్రానికి 'మహా సముద్రం' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కాగా ఈ సినిమాలో అదితిరావు హైదరి హీరోయిన్‌గా ఎంపికైందని వార్తలు వినిపించాయి. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం ఇప్పుడు రాశీఖన్నా నటించనుందని అంటున్నారు. ఇది వరకే రవితేజ, రాశీఖన్నా కలిసి 'బెంగాల్ టైగల్', 'టచ్ చేసి చూడు' సినిమాల్లో జోడిగా నటించారు. ఇప్పుడు అంతా అనుకున్నట్లు జరిగితే ఈ జోడి మూడోసారి తెరపై సందడి చేస్తుందని టాక్. డిసెంబర్ నుండి ఈ సినిమా ప్రారంభమవుతుందని, రిలీజ్ వచ్చే ఏడాదిలోనేనని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం.

More News

‘మన్మథుడు-2’ ఇక్కడ అట్టర్ ప్లాప్.. అక్కడ సూపర్ హిట్!

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ హీరోహీరోయిన్లుగా ఒకే ఒక్క సినిమాతో హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’.

జంట నగరాల్లో వేలకొలది ముత్తయిదువలకు శ్రావణ కానుక - పురాణపండ శ్రీనివాస్

శుభాలకు వేదిక శ్రావణ మాసం. ఈ పవిత్ర మాసంలో చేసే మంగళ కర్మలకు ఫలసమృద్ధి సంతోషంగా చేకూరుతుందని మన స్త్రీలకు తరతరాలుగా విశ్వాసం.

హీరో నాగశౌర్యకు షాకిచ్చిన పోలీసులు

యువ కథానాయకుడు నాగశౌర్యకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు షాకిచ్చారు.

బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రీసెంట్‌గా విడుదలైన `రాక్షసుడు` చిత్రంతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతుందని నిరూపించే సినిమాల్లో `ఎవరు` సినిమా నిలుస్తుంది - నిర్మాత పి.వి.పి

అడివిశేష్, రెజీనా కసండ్ర, నవీన్ చంద్ర ప్రధాన తారాగణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న థ్రిల్లర్ `ఎవరు`.