close
Choose your channels

ఏపీలో మరోసారి షాకిచ్చిన కరోనా.. భారీగా కేసుల నమోదు

Thursday, July 30, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో కరోనా మరోసారి షాకిచ్చింది. తొలిసారిగా బుధవారం 10 వేలు దాటిన కేసులు.. నేడు అంతకంటే మరికొన్ని ఎక్కవే నమోదు కావడం గమనార్హం. ఏపీ కరోనా హెల్త్ బులిటెన్‌ను గురువారం వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 70,068 శాంపిళ్లను పరీక్షించగా.. 10,167 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 130557కే చేరింది. ప్రస్తుతం ఏపీలో 69,252 యాక్టివ్ కేసులుండగా.. మొత్తంగా 60,024 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 68 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1281కి చేరుకుంది. అయితే కరోనాతో తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో తొమ్మిది మంది, అనంతపూర్, కర్నూలు, విశాఖలో ఎనిమిది మంది, చిత్తూరు, కడపలో ఆరుగురు, ప్రకాశం, విజయనగరంలో నలుగురు, కృష్ణలో ముగ్గురు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఒక్కరు చొప్పున మరణించారు. నేడు కూడా ఈస్ట్ గోదావరి ల్లాలోనే అత్యధికంగా కేసులు నమోదవడం గమనార్హం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.