మ‌ళ్ళీ దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే..

  • IndiaGlitz, [Tuesday,January 02 2018]

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ చిత్రం తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. జ‌న‌వ‌రి 19 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. విజ‌య‌ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం వినిపిస్తోంది.

అదేమిటంటే.. అంత‌కుముందు ఈ సినిమాకి త‌మ‌న్ సంగీత ద‌ర్శ‌కుడుగా ఎంపిక‌య్యాడ‌ని వార్త‌లు వినిపించాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం.. దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమాకి ఎంపిక‌య్యాడ‌ని తెలిసింది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం చేస్తున్న రంగ‌స్థ‌లం చిత్రానికి దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాగా.. బోయ‌పాటి గ‌త చిత్రం జ‌య‌జాన‌కి నాయ‌కకి కూడా దేవిశ్రీ‌నే స్వ‌రాలు అందించాడు.

అంటే.. చ‌ర‌ణ్‌, బోయ‌పాటి వ‌రుస రెండు చిత్రాల‌కు దేవిశ్రీ ప్ర‌సాద్‌నే సంగీత ద‌ర్శ‌కుడు అన్న‌మాట‌. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ నెల 28 నుంచి రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటార‌ని తెలిసింది.

More News

రాజ్‌ తరుణ్‌ 'రంగుల రాట్నం' ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది

2017లో 'రారండోయ్‌ వేడుక చూద్దాం', 'హలో' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను అందించిన అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన 'రంగుల రాట్నం' చిత్రం ఈ సంక్రాంతి రిలీజ్‌కి రెడీ అవుతోంది. రాజ్‌ తరుణ్‌, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రానికి శ్రీరంజని దర్శకత్వం వహిస్తున్నారు.

రచయిత రామస్వామి దర్శకత్వంలో 'మూడు పువ్వులు ఆరు కాయలు'!

`ప్రేమ గొప్పదే.. జీవిత లక్ష్యం ఇంకా గొప్పది.ప్రేమంటే చంపటమో చావటమో కాదు,చచ్చేదాకా కలిసి బ్రతకటం.

మర్ల పులి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి

వరుణ్ సందేశ్ ప్రత్యక పాత్రలో అర్చన వేద ,పోసాని కృష్ణ మురళి ,ముఖ్య పాత్రలో సుధాకర్ IMPECS INDIA PVT LTD పతాకం పై భవాని శంకర్ బి.సుధాకర్ రెడ్డి ఐ యస్.దినకర్ రెడ్డి సంయుక్తంగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మర్లపులి.ఇటీవలే సైరా నరసింహరెడ్డి సంస్థా కార్యాలయంలో చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు.

వైఎస్సార్ గా మమ్ముట్టి..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కనుంది.

రాశి ఖన్నా.. డబుల్ ధమాకా

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశి ఖన్నా.