50 రోజులు పూర్తి చేసుకున్న ఊపిరి - స్పందించిన నాగార్జున...

  • IndiaGlitz, [Friday,May 13 2016]

టాలీవుడ్ కింగ్ నాగార్జున - కోలీవుడ్ హీరో కార్తీ - మిల్కీబ్యూటీ త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ ఊపిరి. తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఊపిరి చిత్రం అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది.
వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సును క‌దిలించేలా అద్భుతంగా తెర‌కెక్కించారు. ఊపిరి 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా కింగ్ నాగార్జున ట్విట్ట‌ర్ లో...ఊపిరి ఓ అంద‌మైన చిత్రం. ఓ మంచి చిత్రం చేసామ‌ని గ‌ర్వ‌ప‌డేలా ఊపిరి చిత్రం రూపొంద‌డానికి కార‌కులైన ప్ర‌తి ఒక్క‌రికీ థ్యాంక్స్ అంటూ స్పందించారు. సంక్రాంతికి సోగ్గాడు చిన్ని నాయ‌నా...స‌మ్మ‌ర్ లో ఊపిరి..ఈ రెండు చిత్రాల‌తో 100 కోట్లకు పైగా షేర్ సాధించి స‌రికొత్త రికార్డ్ సృష్టించారు సెల్యూలాయిడ్ సైంటిస్ట్ నాగార్జున‌.

More News

ఆ...అవకాశం రావడం అవార్డ్ కంటే ఎక్కువ - సమంత

సూపర్ స్టార్ మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్నభారీ చిత్రం బ్రహ్మోత్సవం.

నందినితో నితిన్....

అలా మొదలైంది,కళ్యాణ వైభోగమే చిత్రాల సక్సెస్ తర్వాత నందినీ రెడ్డి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు.

ఎన్టీఆర్ తో సమంత అంటే..అంతేనా?

ఎన్టీఆర్ తో ఎక్కువ చిత్రాలు చేసిన కథానాయిక ఎవరు? అంటే దీనికి సమాధానం ఠక్కున వస్తుంది సమంత అని.

వారి బాటలోనే విక్రమ్ వెళుతున్నాడా?

ప్రస్తుతానికి తెలుగులో ఆ ట్రెండ్ లేదు కానీ..తమిళంలో ఓ ట్రెండ్ కొనసాగుతోంది.అదేమిటంటే..

అభిషేక్ పిక్చర్స్ చేతిలో 'కబాలి'...

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పారంజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కబాలి’.