నటి కల్పన మృతికి సంతాపం తెలిపిన 'ఊపిరి' యూనిట్‌

  • IndiaGlitz, [Monday,January 25 2016]

నటి ఊర్వశి సోదరి కల్పన(51) ఈరోజు(25) తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించారు. తమిళ, మలయాళ భాషల్లో కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న కల్పన ప్రస్తుతం నాగార్జున, కార్తీ హీరోలుగా పివిపి సినిమా పతాకంపై పివిపి నిర్మిస్తున్న 'ఊపిరి' చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో కల్పనకు సంబంధించిన సీన్స్‌ చిత్రీకరణ ఆదివారం(24)తో ముగిసింది. సోమవారం కొంత ప్యాచ్‌వర్క్‌ చెయ్యాల్సి వుంది. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు ఈరోజు జరగనున్న ఓ అవార్డ్‌ ఫంక్షన్‌లో కూడా ఆమె పాల్గొనాల్సి వుంది. నిన్న షూటింగ్‌ ముగించుకొని వెళ్ళిన కల్పన రాత్రి నిద్రలోనే తుదిశ్యాస విడిచారు. ఇప్పటివరకు 300కి పైగా తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి అందరినీ అలరించిన కల్పన తన చివరి ఊపిరి వరకు నటించి కన్నుమూశారు.

1980లో నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన కల్పన 2012లో 'ఎన్‌జాన్‌ తనిచెల్ల' అనే మలయాళ చిత్రంలో నటించినందుకుగాను బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌గా నేషనల్‌ అవార్డును అందుకున్నారు. కమల్‌హాసన్‌తో 'సతీ లీలావతి', 'బ్రహ్మచారి' చిత్రాల్లో నటించిన కల్పన తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం.

కల్పన ఆకస్మిక మృతి పట్ల 'ఊపిరి' యూనిట్‌ తమ సంతాపాన్ని తెలియజేసింది. కల్పన మరణవార్త తెలుసుకున్న హీరో కార్తీ హాస్పిటల్‌కి వెళ్ళి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. అక్కినేని నాగార్జున, వంశీ పైడిపల్లి, పివిపిలతోపాటు యూనిట్‌ సభ్యులంతా హాస్పిటల్‌కి వెళ్ళి ఆమె భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

'ఊపిరి' నిర్మాత పివిపి మాట్లాడుతూ - ''కల్పన చాలా మంచి నటి. మా 'ఊపిరి' చిత్రంలో చాలా మంచి క్యారెక్టర్‌ చేశారు. ఆదివారంతో ఆమెకు సంబంధించిన షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఆమె చివరి ఊపిరి వరకు నటిస్తూనే వున్న కల్పన ఆకస్మికంగా మృతి చెందడం మా యూనిట్‌ సభ్యుల్ని కలచివేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము'' అన్నారు.

More News

జ‌న‌తా గ్యారేజ్ ఫ‌స్ట్ షెడ్యూల్ డీటైల్స్

నాన్న‌కు ప్రేమ‌తో...సినిమాతో విజ‌యం సాధించిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమాని ప్రారంభించ‌డానికి రెడీ అవుతున్నాడు. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమా చేస్తున్నారు.

నాగ్ తో ఫైట్ చేయ‌నున్న జ‌గ్గుభాయ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున సోగ్గాడే చిన్ని నాయ‌నా సినిమాతో బ్లాక్ బ‌ష్ట‌ర్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసారు.

'సావిత్రి' రిలీజ్ డేట్

నారా రోహిత్..., యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తొలి చిత్రం బాణం నుండి అసుర వరకు విభిన్న కథాంశాలతో సినిమాలను చేస్తున్న హీరో. నారారోహిత్ హీరోగా, నందిత హీరోయిన్ గా రూపొందుతోన్న చిత్రం 'సావిత్రి'.

పోస్ట‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న సూర్య‌

సూర్య న‌టిస్తున్న తాజా చిత్రం 24. ఈ చిత్రాన్ని మ‌నం ఫేం విక్ర‌మ్ కుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తుండ‌డం విశేషం. పాత్ర డిమాండ్ చేయాలే కానీ...ఎలాంటి పాత్ర చేయ‌డానికైనా సూర్య రెడీ.

రెజీనా కూడా లిస్టులో చేరింది..

నయనతార,త్రిష,హన్సిక,తాప్సీ ఇలా ఇప్పుడున్న హీరోయిన్స్ అందరూ హర్రర్ చిత్రాల్లో నటించారు.