నాగార్జున ఇంటికి ముట్టడించిన ఓయూ విద్యార్థులు
- IndiaGlitz, [Saturday,July 20 2019]
బిగ్బాస్ షోపై వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఈ షోను ఆపేయాలంటూ ఇప్పటికే పోలీసు స్టేషన్లు, కోర్టు మెట్లెక్కిన విషయం విదితమే. మరోవైపు షో ఆపేయాల్సిందేనని ఓయూ విద్యార్థులుపట్టుబట్టారు. శనివారం నాడు బిగ్బాస్ షోని నిలుపుదల చేయాలంటూ కందుల మధు ఆధ్వర్యంలో ఓయూ నుంచి పెద్ద ఎత్తున బయల్దేరి వచ్చి మొదట బిగ్బాస్ హోస్ట్గా వ్యవహరిస్తున్న అక్కినేని నాగార్జున ఇంటిని ముట్టడించారు. షోలో పాల్గొనవద్దని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు.. బిగ్బాస్ షోలో కాస్టింగ్ కౌచ్ లేదని నాగార్జున ప్రకటించాలని విద్యార్థులు హెచ్చరించారు. షోను ఆపకపోతే నాగార్జున స్టూడియోల దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఓయూ విద్యార్థులు పిలుపునిచ్చారు. అయితే ఈ ముట్టడి జరిగినప్పుడు నాగ్ ఇంట్లో లేరని సమాచారం. ఈ వ్యవహారంపై అక్కినేని నాగార్జున మాత్రం ఇంతవరకూ రియాక్ట్ కాలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన స్పందించకపోవడం గమనార్హం. అయితే షో నిర్వాహకులు కూడా ఈ వ్యవహారంపై స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతోందని, సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ, శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా వంటి నటీమణులు కోర్టులో కేసు వేసిన విషయం విదితమే. కాగా.. బిగ్బాస్ సీజన్ 3 ఆదివారం(జూలై 21) నుండి ప్రారంభం కానున్నది. ఈ వివాదాల నేపథ్యంలో అసలు షో ప్రారంభం అవుతుందా..? లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
OU students surround #Nagarjuna's house in protest against #BiggBossTelugu3 #BiggBoss3 #BiggBossTelugu pic.twitter.com/ipDomhKHTh
— IndiaGlitz™ l Telugu (@igtelugu) July 20, 2019