'ఆర్‌ఆర్‌ఆర్‌'కు ఓవర్‌ సీస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సమస్య?

దర్శకుధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్)‌’. ఈ ఫిక్ష‌నల్ పీరియాడిక‌ల్ డ్రామాలో కొమురం భీమ్‌గా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియాభ‌ట్ వంటి బాలీవుడ్ స్టార్స్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఇందులో న‌టిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్‌ 13న దసరా సందర్భంగా సినిమాను విడుదల చేయడానికి రాజమౌళి అండ్‌ టీమ్‌ తలమునకలై షూటింగ్‌ను పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

సినిమాపై ఉన్న క్రేజ్‌తో అన్నీ ఏరియాలకు ఫ్యాన్సీ ఆఫర్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే చాలా ఏరియాల హక్కులను నిర్మాత ఫైనల్‌ చేసేసినట్లు సమాచారం. తాజా సమాచారం మేరకు ఓవర్‌సీస్‌ హక్కుల విషయంలో ఓవర్‌సీస్‌ బయ్యర్‌కు, యు.ఎస్‌ డిస్ట్రిబ్యూటర్‌కు మధ్య మనస్పర్ధలు నెలకొన్నాయని.. ఎంతలా అంటే లీగల్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే రాజమౌళి అండ్‌ టీమ్‌ అంత వరకు వెళ్లనీయదని సమస్యను క్లియర్‌ చేసేస్తారని అంటున్నారు.

More News

ఇక అవినీతికి టీకాలు వేసేందుకు సిద్ధమవ్వండి: కమల్ హాసన్

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీదిమయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

రాజకీయాలు, సినిమాలతో పవన్ బిజీ బిజీ..

పవన్ కళ్యాణ్‌కు ప్రపంచవ్యాప్తంగా మిలియన్లలో అభిమానులు ఉన్నారు.

అప్‌డేట్ ఇస్తున్నాం.. ఆయన వచ్చేశారు: ‘ఆర్ఆర్ఆర్’ టీం

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న

వెంకటేష్ 'దృశ్యం 2' ప్రారంభం

విక్టరీ వెంకటేష్‌, మీనా జంటగా న‌టించిన `దృశ్యం` సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అయిందోఅందరికీ తెలిసిందే.

4 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతున్న సాయిపల్లవి ‘కోలు కోలు’

సాయి పల్లవి పాటలు మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ‘వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే’ అంటూ యూత్‌ని గతంలో కిర్రెక్కించిన సాయి పల్లవి