ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌కు అనుమతి

  • IndiaGlitz, [Monday,August 03 2020]

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో మరో అడుగు ముందుకు పడింది. రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ).. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)కి పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు డీసీజీఐ వి.జి సొమానీ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎస్ఐఐ వెల్లడించింది. ‘కోవిషీల్డ్’ పేరిట ఈ వ్యాక్సిన్ తయారవుతోంది. కాగా.. ఆక్స్‌ఫర్డ్ జరిపిన మొదటి రెండు దశల ఫలితాలను విశ్లేషించిన తర్వాత దీనిని భారత్‌తో పరీక్షించేందుకు అనుమతించాలని డీసీజీఐకి సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌లోని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దీంతో కోవిషీల్డ్‌ను భారత్ ప్రయోగించేందుకు అనుమతి లభించినట్టైంది.

దేశంలో 17 ప్రాంతాల్లో ఈ ప్రయోగాలు జరగనుండగా.. వీటిలో విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజ్‌కి అవకాశం దక్కింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో భాగంగా ఆరోగ్యవంతులైన 18 ఏళ్లకు పైబడిన వారిపై పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు 1600 మంది వలంటీర్లపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నారు. ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. కాగా.. ఈ వ్యాక్సిన్ ఉత్పత్తిలో 50 శాతం భారత్‌కే కేటాయిస్తామని ఇటీవల కంపెనీ సీఈఓ అదార్ పూణావాలా ప్రకటించారు. అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ ధర కూడా వేయిలోపే ఉంటుందని కూడా కంపెనీ తెలిపింది.

More News

ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్న ‘సాహో’ డైరెక్టర్..

కరోనా మహమ్మారి కారణంగా సెలబ్రిటీల పెళ్లిలన్నీ సింపుల్‌గా జరిగిపోతున్నాయి.

హిట్ డైరెక్ట‌ర్‌ని లాక్ చేసిన మైత్రీ మూవీస్‌..!!

ప్ర‌స్తుతం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఉన్న అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌టి. చిరంజీవి, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ప్ర‌భాస్‌, మ‌హేశ్‌, అల్లు అర్జున్ వంటి స్టార్స్‌తో

ఛానెల్ ఎడిట‌ర్‌పై ఆర్జీవీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. సినిమా చేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ఈ లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌ల‌కు మేక‌ర్స్ దూరంగా ఉంటున్నారు.

చెన్నై సేఫ్ అంటున్న త‌లైవా అండ్ టీమ్‌!!

మ‌న సీనియ‌ర్ స్టార్స్ అంద‌రూ షూటింగ్స్ స్టార్ట్ చేయాలంటే భ‌య‌ప‌డుతున్నారు. వీరిని ఇంత‌లా భ‌య‌పెడుతున్నదెవ‌రో కాదు..

ఆరు గెట‌ప్స్‌లో ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న ప్రెస్టీజియ‌స్ చిత్రం ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’.